Indonesia: కారు, బైకులను ఢీకొన్న స్కూల్ బస్సు.. 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు జావా ద్వీపంలోని పట్టణమైన డిపోక్ నుంచి ప్రముఖ పర్యాటక ప్రదేశమైన లెంబాంగ్కు వెళుతున్నారు. గ్రాడ్యుయేషన్ ట్రిప్కు హైస్కూల్ విద్యార్థులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం 6:48 గంటలకు ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
Read Also: Rajasthan: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మృతి
Also Read
విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ను జరుపుకుని.. పాఠశాలకు తిరిగి వస్తుండగా.. బస్సు అదుపు తప్పి కారు, మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు, మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలు కాగా.. మరో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి ముందు బస్సు బ్రేక్ సరిగా పని చేయలేదని తాను అనుమానిస్తున్నానని, అయితే ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని స్థానిక ట్రాఫిక్ పోలీసు చీఫ్ ఉండంగ్ సైరిఫ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!