Independence Day: సీఎం-గవర్నర్ మధ్య గ్యాప్.. జీవిత ఖైదీలకు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15న జీవిత ఖైదీలకు క్షమాభిక్షల ద్వారా విడుదల అవుతారని అందరు అనుకున్నారు.. అయితే, చివరకు వారికి నిరాశే మిగిలింది. రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడమే కారణమని తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 120 మంది ఖైదీల విడుదల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు సార్లు క్షమాభిక్షలు ప్రసాదించింది. వందలాది మంది జీవిత ఖైదీలు విడుదల కాలేకపోవడం వల్ల 35 సంవత్సరాలుగా జైళ్ల నాలుగు గోడల మధ్య ఖైదీలు నలిగిపోతున్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అయితే.. ఇప్పుడు క్షమాబీక్షలు దయ దక్షణాలుగా మారాయి. డబ్బు అంగబలం ఉన్న ఖైదీలు ఉంటే వారి కోసం గత ప్రభుత్వాలు ప్రత్యేక జీవోల ద్వారా విడుదల చేశాయి. కిడ్నాప్, అత్యాచారాలు, చిన్నారుల హత్యలు, డబుల్ మర్డర్ హత్య కేసు, బాంబు పేలుళ్ల కేసులు వంటి వాటికి క్షమాభిక్షులు లేకపోవడం గమనార్వం. ఇక, ఒక నేరస్తుడు ఐదు సంవత్సరాల శిక్ష అనుభవిస్తే చాలునని గాంధీ ముళ్ళ కమిషన్లు వెల్లడించాయి. మాగుంట సుబ్బిరామ రెడ్డి హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న గణేష్ 35 సంవత్సరాలు గా చర్లపల్లి జైలులో మగ్గిపోతున్నాడు.
Read Also: Kejriwal: సుదీర్ఘ ప్రసంగాలు చేస్తే భారతదేశం విశ్వగురువు కాదు.. మోడీకి ఢిల్లీ సీఎం కౌంటర్
ఇక, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సదరు జీవిత ఖైదీకి క్షమాబిక్షను ప్రసాదించారు. ఏదో ఒక కారణంతో ఆ క్షమాభిక్ష నిలిచిపోయింది. కేసీఆర్ క్షమాభిక్ష ప్రసాదించారు. కేంద్ర సీబీఐ పరిధిలోకి వెళ్ళింది.. గణేష్ క్షమా బిక్ష ఏదో ఒక కారణంతో నిలిచిపోతు వచ్చింది. హైకోర్టు నెల రోజుల బెల్ మంజూరు చేసింది.. పరివర్తన చెందిన ఖైదీలుగా అధికారులు గుర్తించారు.
Read Also: Students Protest: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కుళ్ళిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థుల ఆందోళన
ఆగస్టు 15 జీవిత ఖైదులు విడుదల అవుతారని కొండంత ఆశతో ఎదురు చూశారు. గవర్నర్, హోం శాఖ, జైళ్లశాఖ అధికారులతో గంటలు తరబడి చర్చించారు. క్షమాభిక్ష రాకపోవడంతో చర్లపల్లి, చంచల్ గూడా, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రధాన జైళ్లల్లో జీవిత ఖైదీలు నిరాశతో కనిపిస్తున్నారు. జీవిత ఖైదీలకు క్షమాభిక్షులు ప్రసాదించి అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని రాజకీయ విడుదల కమిటీ కార్యదర్శి బల్ల రవీందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షమాభిక్షలపై కొర్రీలు పెట్టి ఖైదీల జీవితాలతో ఆటలు ఆడొద్దని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!