Minister Kandula Durgesh: రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు పెట్టారు..
Minister Kandula Durgesh: రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవస్థల్ని అస్తవ్యస్తమైన పరిస్థితులలోకి నెట్టేసింది.. సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాస్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజుల్లోనే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెల్లే కార్యాచరణ మొదలైందని.. అందులో భాగమే ఆర్థిక భారంగా వున్నా ఒకే రోజులో పెంచిన పెన్షన్ లు పంపిణీ చేశాం అనివెల్లడించారు.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు..
Read Also: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
Also Read
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ఇక, జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు ఎలా వుండాలో జిల్లా అధికారుల సమావేశంలో చార్చించాం అన్నారు కందుల దుర్గేష్.. ఎక్కువసార్లు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి సమీక్షలు నిర్వహించుకోవడం ద్వారా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు, ప్రజల అవసరాలు సకాలంలో తీర్చగలం అన్నారు.. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, టూరిజం, పుష్కరాలు వంటి ప్రాధాన్యత రంగాలుపై జిల్లా అధికారులతో చర్చించాం .. వచ్చే సమావేశానికి సమగ్రప్రణాళికతో రావాలని అదేశించామని వెల్లడించారు.. జిల్లాలో రైతులకు 7కోట్ల రూపాయలే బాకీ వున్నాం.. రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ మెరుగైన సేవలు రైతులకు అందిస్తాం.. పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టాం.. కిలో బియ్యం 49లేదా 48 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకు అమ్మకాలు రైతు బజార్లలో ప్రారంభించినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో