Minister Kandula Durgesh: రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు పెట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kandula Durgesh: రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవస్థల్ని అస్తవ్యస్తమైన పరిస్థితులలోకి నెట్టేసింది.. సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాస్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజుల్లోనే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెల్లే కార్యాచరణ మొదలైందని.. అందులో భాగమే ఆర్థిక భారంగా వున్నా ఒకే రోజులో పెంచిన పెన్షన్ లు పంపిణీ చేశాం అనివెల్లడించారు.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు..
Read Also: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
Also Read
ఇక, జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు ఎలా వుండాలో జిల్లా అధికారుల సమావేశంలో చార్చించాం అన్నారు కందుల దుర్గేష్.. ఎక్కువసార్లు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి సమీక్షలు నిర్వహించుకోవడం ద్వారా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు, ప్రజల అవసరాలు సకాలంలో తీర్చగలం అన్నారు.. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, టూరిజం, పుష్కరాలు వంటి ప్రాధాన్యత రంగాలుపై జిల్లా అధికారులతో చర్చించాం .. వచ్చే సమావేశానికి సమగ్రప్రణాళికతో రావాలని అదేశించామని వెల్లడించారు.. జిల్లాలో రైతులకు 7కోట్ల రూపాయలే బాకీ వున్నాం.. రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ మెరుగైన సేవలు రైతులకు అందిస్తాం.. పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టాం.. కిలో బియ్యం 49లేదా 48 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకు అమ్మకాలు రైతు బజార్లలో ప్రారంభించినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!