Tajikistan: 96 శాతం ముస్లింలున్న దేశంలో హిజాబ్ పై నిషేధం.. మసీదుల స్థానంలో కేఫ్లు, హాల్స్!
- అన్ని ఇస్లామిక్ దేశాల్లో మహిళలకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్
- తజికిస్థాన్ లో భిన్న పరిస్థితులు
- హిజాబ్ పై నిషేధం
- మసీదుల స్థానంలో కేఫ్లు.. హాల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు అన్ని ఇస్లామిక్ దేశాలు మహిళలకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, మర్యాద గురించి మాట్లాడుతున్నాయి. అయితే తజికిస్థాన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వం హిజాబ్ ధరించడం, గడ్డం పెంచుకోవడంపై నిషేధం విధించింది. ఇది కాకుండా.. పిల్లలు బహిరంగంగా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనలేరు. ప్రభుత్వం దేశంలోని మసీదులను కూడా మూసివేస్తోంది. వాటి స్థానంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. ఎవరు ఏ లాజిక్తో ఈ మార్పు చేస్తున్నారో తెలుసుకోండి.
READ MORE: Balineni Srinivas: వైసీపీలో కాకరేపుతున్న మాజీ మంత్రి వ్యవహారం.. ఆ నేతలతో భేటీ
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
చట్టపరమైన నిషేధం..
తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రెహ్మాన్ హిజాబ్ను ‘విదేశీ వస్త్రం’ అని పిలుస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రెహమాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిజాబ్పై అనధికారిక నిషేధం కనిపించడం ప్రారంభమైంది. దీనిపై ఎటువంటి నియమం లేదా శిక్ష లేనప్పటికీ.. ఇప్పుడు సుమారు రెండు నెలల క్రితం, ఈ దేశం పార్లమెంటులో సరైన తీర్మానం చేయడం ద్వారా హిజాబ్ను నిషేధించింది. దీనికి బదులు హిజాబ్ ధరించడం, అమ్మడం, కొనడం, ప్రచారం చేయడంపై నిషేధం ఉంది.
READ MORE:Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ప్రభుత్వరంగ బ్యాంకుల హవ!
ఉల్లంఘిస్తే భారీ జరిమానా..
ఈ ఆంక్ష కేవలం మాట్లలకే పరిమితం కాలేదు. ఎవరైనా స్త్రీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే, ఆమెకు సుమారు 700 డాలర్ల జరిమానా విధించబడుతుంది. గవర్నమెంట్ పోస్టులో పనిచేసే మహిళ ఇలా చేస్తే.. అంతకు మించిన పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. హిజాబ్ మాత్రమే కాదు. తజిక్ ప్రభుత్వం అనేక మతపరమైన ఆచారాలను నిషేధించింది.
READ MORE:Viral News: 24 ఏళ్లుగా రోజూ10 సిగరెట్లు.. ఒక్కసారిగా మానేసిన వ్యక్తి.. ఎలాగో చూడండి
మసీదులను కేఫ్లుగా, హాల్స్గా మార్చారు..
ది డిప్లొమాట్ యొక్క నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలలో తజికిస్తాన్ ప్రభుత్వం రెండు వేలకు పైగా మసీదులను మూసివేసింది. వాటిని కేఫ్లు, సినిమాస్, ఫ్యాక్టరీలు లేదా సోషల్ వర్క్ సెంటర్లుగా మార్చింది. మతపరమైన ఆచారాలను మతోన్మాద పరిధి నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశ్యం. ప్రెసిడెంట్ ఎమోమాలి రెహ్మాన్ వెంటనే దీన్ని చేయలేదు. బదులుగా రిజిస్ట్రేషన్ లేని మసీదులకు మొదట నోటీసులు జారీ చేయబడ్డాయి. దీని తర్వాత ప్రభుత్వం అనధికార మత స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.
READ MORE: Laura Loomer: డొనాల్డ్ ట్రంప్తో “లారా లూమర్”.. ఎవరు ఈమె..? ఎందుకంత ప్రచారం..?
ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది?
2020 సంవత్సరంలో.. ఈ దేశంలోని మొత్తం జనాభాలో 96 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు షాకింగ్గా మారాయి. అధ్యక్షుడు ఎమోమాలి రెహమాన్ యొక్క ఈ చర్యల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మతోన్మాదాన్ని తగ్గించడం, మిగిలిన ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం, తొంభైలలో సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) నుంచి విడిపోయిన తరువాత.. తజికిస్థాన్లో అనేక ఛాందసవాద శక్తులు ఉద్భవించాయి. తమలో తాము కొట్లాడి అధికారం చేజిక్కించుకోవాలని తపించారు. ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 6 సంవత్సరాల పాటు అక్కడ యుద్ధం కొనసాగింది.
READ MORE: CM Chandrababu: వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
అప్పటికి రెహమాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో, స్వతంత్ర తజికిస్థాన్లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. అందులో రహ్మాన్ గెలిచారు. అప్పటి నుంచి అనేక రాజ్యాంగ సవరణలతో ఆయన అధికారంలో కొనసాగుతున్నారు. అంతర్యుద్ధం సమయంలో ఇస్లామిక్ సంస్థలు దేశానికి భారీ నష్టాన్ని కలిగించినందున.. కొత్త అధికారిక ప్రభుత్వం దానిని నియంత్రించాలని నిర్ణయించుకుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!