MJPJAY: మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఇక నుంచి ఆ పథకం అందరికీ
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన షిండే సర్కార్
- నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ ను
- ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5 లక్షలకు బదులుగా మొత్తం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకాన్ని 2012లో ప్రారంభించారు.
India-Ukraine: ఉక్రెయిన్కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!
Also Read
ఈ పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ యునైటెడ్ ఇండియా అస్యూరెన్స్ను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 12.3 కోట్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1300 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24లో 5.7 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. కొత్త పథకం అమలుకు ముందు.. బీమా చేసిన వ్యక్తి దాని ప్రయోజనాలను పొందేందుకు రూ. 1 లక్ష వరకు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానిని తొలగించి పౌరులందరికీ సమానంగా అమలు చేసింది. ఇప్పుడు ఆదాయానికి కూడా పరిమితి లేదు. ఈ పథకం కింద గతంలో 1000 ఆసుపత్రులను ఎంప్యానెల్ చేయగా ఇప్పుడు 1900 ఆసుపత్రులకు పెంచారు.
Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!
గత ఏడాది జూన్లో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎంజేపీజేఏవై (MJPJAY) బీమా మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా.. లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో ప్రభుత్వం దానిని ఖరారు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ పథకం జూలై 1 నుండి కొత్త రూపంలో ప్రారంభించబడనుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!