India-Ukraine: ఉక్రెయిన్కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!
- ఉక్రెయిన్కు మద్దతుగా సంతకం చేసేందుకు భారత్ నిరాకరణ
- స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాని రష్యా
- ఇలాగైతే శాంతి చర్చలకు పరిష్కారం దొరకదన్న భారత్
- భారత్తో సహా పలు దేశాలు సంతకాలు చేసేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని.. దీని వలన సమయం వృధా అని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో సంతకం చేసేందుకు భారత్ ముందుకు రాలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా 50 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు.. ఇందుకోసం ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్లో రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రష్యా మాత్రం హాజరుకాలేదు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్స్టాడ్లో రెండు రోజుల చర్చలు జరిగాయి.
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
ఈ సమావేశానికి ఇండియా తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఉక్రెయిన్లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను అన్వేషించడం భారత్ ఉద్దేశం అని కపూర్ తెలిపారు. అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. మా విధానం స్థిరంగా ఉందని.. సమాధానం లేదా దౌత్యం ద్వారా మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించొచ్చని భారత్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపించాలని భారత్ అభిప్రాయపడింది.
సమ్మిట్లో దేశాధినేతలతో సహా 100కి పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశం అయ్యారు. చైనా కూడా హాజరు కావడం విశేషం. కొన్ని దేశాలు ఉక్రెయిన్ మద్దతుగా సంతాకాలు చేయగా.. భారత్తో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేసినట్లు వార్తా సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!