Bhatti Vikramarka : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అప్పుల పాలైంది.. రోడ్డున పడ్డ నిరుద్యోగులు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కుమ్మరి తండాకు చేరుకుంది. టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ బోర్డు నియామకం చేసిన ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు.
Also Read : Payyavula Keshav: ఎమ్మెల్సీ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కల్లోలితంగా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించాలి లేకుంటే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సమయత్తం చేస్తాం.. ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమం చేపడుతామని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికే తమ పాదయాత్ర అంటూ భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read : Bhuma AkhilaPriya : ఆళ్లగడ్డ అసలు ప్రభుత్వం దృష్టిలో ఉందా.. లేదా?
TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ కి బాధ్యులైన వారు తమ పదవులకు రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధరణి వల్ల ఎక్కువగా పేద రైతులే నష్ట పోయారన్నారు. ఒకప్పుడు భూములను వదిలేసి వెళ్లిన వారందరికీ లబ్ది చేకూర్చిందన్నారు. కేసీఆర్ తీరు, ధరణి వెబ్ సైట్ వల్ల రాష్ట్రంలో తిరిగి ప్యూడలిజం వచ్చిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. కాస్తు సహా ఇతర కాలమ్స్ ను పొందు పరుస్తామన్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని భట్టి విక్రమార్క అన్నారు.
- Tags
- bhatti vikramarka
- bjp
- BRS
- congress
- kcr
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో