Telangana: నేటితో ముగియనున్న సర్పంచుల పదవికాలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టితో గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. ఇక పాలనను అధికారులకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలని సర్పంచుల సంఘం కోరింది. అయితే పొడిగింపుపై తెలంగాణ సర్కార్ స్పందించలేదు.. గత ప్రభుత్వ హయంలో సకాలంలో నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీలు దీవాల తీశాయి. దీంతో పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు తమ పదవిని పొడిగించాలన్న సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు కోరుతున్నారు. ఇక, రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
Read Also: Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంతరాయం!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అయితే, మరికొద్ది గంటలలో సర్పంచులు తమ పదవి కాలం ముగియడంతో చాల మంది అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. కొత్త గ్రామ పంచాయతీల నిర్మాణం, శ్మశాన వాటిక, ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలని గత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. దీంతో చాలా మంది సర్పంచులు ఈ పనులను పూర్తి చేసి అప్పుల పాలయ్యారు. కానీ బిల్లుల మంజూరులో కేసీఆర్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి తొడు రెండేళ్ళు కరోనా కారణంగా శానిటేషన్ ఇతర పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఆ నిధులు కూడా మంజూరు కాలేదు.. దీంతో సర్పంచులే ఏదో విధంగా నిధులని జమ చేసుకున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచుల సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. అయితే కేటీఆర్కి కాంగ్రెస్- బీజేపీ పార్టీల నేతలు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయంలో చేసిన తప్పుల కారణంగానే గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!