దేశంలో ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై Hindustan Petroleum Corporation Limited (HPCL) కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని, పెట్రోల్ బంక్ల వద్ద సరఫరా తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై స్పందించిన HPCL అధికారులు ఈ వార్తలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని సంస్థ పేర్కొంది. దేశంలో అవసరమైనంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది.
Read Also: CM Chandrababu: గ్లోబల్ లీడర్లుగా భారతీయులు.. త్వరలోనే రివర్స్ మైగ్రేషన్..
అలాగే ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని HPCL వెల్లడించింది. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించింది. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడం లేదా భయంతో ఎక్కువగా కొనుగోలు చేయడం అవసరం లేదని కూడా సంస్థ స్పష్టం చేసింది. దేశంలో ఇంధన సరఫరా సక్రమంగా కొనసాగుతోందని మరోసారి హామీ ఇచ్చింది. అదేవిధంగా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని HPCL ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగిస్తూ అవసరానికి అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది.