Etela Rajender : పేదల భూముల కబ్జాలపై ఈటల ఆగ్రహం.. అతడి చెంప చెళ్లుమనిపించిన ఈటల
- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత
- ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు
- ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల
- రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల, మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పేదల భూముల అక్రమ వ్యాపారం తనకు తెలిసిన వెంటనే అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ను ప్రశ్నించడమే కాకుండా, ఆగ్రహంతో చేయిచేసుకున్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, పేదల భూములు కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. “కొందరు రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా హస్తగతం చేసుకుంటున్నారు. ఇది నేరం. తప్పు చేసే బ్రోకర్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి,” అని ఘాటుగా విమర్శించారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “1985లో నారపల్లి, కొర్రెముల ప్రాంతాల్లో పేదలు కష్టపడి కొనుగోలు చేసిన భూములను కబ్జా చేస్తూ రియల్ వ్యాపారం చేస్తున్నారు. బ్రోకర్ల వల్ల బాధపడుతున్న పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. పేదల భూములను కాపాడటం మా బాధ్యత,” అని హామీ ఇచ్చారు.
అంతేకాక, “తప్పు భూములు కొనుగోలు చేసిన వారికంటే కూడా దొంగ పత్రాలు సృష్టించే అధికారులదే తప్పు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జైలులో పెట్టాలని” డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిపాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల, “చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని భావించాం. కానీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. అయితే, బ్రోకర్లకు మాత్రం పూర్తి సహకారం అందిస్తున్నారు,” అంటూ ఘాటుగా విమర్శించారు.
పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే ఎవరికైనా ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన ఈటల, “బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదు. పేదల కోసం పోరాడుతూనే ఉంటాం,” అని అన్నారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ఉత్కంఠను పెంచడంతో పాటు, పేదల హక్కుల కోసం ఈటల రాజేందర్ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమయ్యాయి.
Trump Diet Coke Button: అమెరికా అధ్యక్ష భవనంలోని ట్రంప్ టేబుల్పై డైట్ కోక్ బటన్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!