Governor Jishnu Dev Varma : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్..
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీకారం
- సామాజిక న్యాయం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం
- పెట్టుబడులు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు – గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. “జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజల కలల సాకారానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అంతేకాకుండా.. TGPSCని బలోపేతం చేశాం. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు పెంచినట్లు, డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలు 200 శాతం పెంచినట్లు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కీమ్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొ్న్నారు. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించామని, శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా సర్వే నిర్వహించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు కట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ చేనేత అభయహస్తం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దావోస్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1,78,950కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!