MP Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Rammohan Naidu: ఏపీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. బాబు సీఎంగా ఉన్న సమయంలో కరువు వస్తే , కరువు మండలాలు ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందించామన్నారు. రైతును దగా చేయటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరు చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారన్నారు. నాడు 2018 సంవత్సరంలో 275 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించామని.. నేడు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే , కేవలం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చెయ్యి దులుపు కుంటుందని మండిపడ్డారు.
Also Read: CM YS Jagan: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు.. వారి కోసం ఎంతో చేస్తున్నాం..
Also Read
- Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
- High-Protein Moong Dal Sandwich Recipe: ప్రోటీన్ పవర్తో పెసరపప్పు శాండ్విచ్.. రుచి, ఆరోగ్యం రెండూ ఒకే వంటకంలో
- Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
ఇరిగేషన్ , అగ్రికల్చర్ మినిస్టర్స్ ఎక్కడ ఉన్నారని.. ఇరిగేషన్ మంత్రి ఇరిటేషన్ మంత్రిగా మారారన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు , ఉన్న కాలువలలో పిడికెడు మట్టి కూడా తీయలేదన్నారు. రైతులు స్వయంగా డబ్బులు ఖర్చు చేసి కాలువలలో పూడిక తీసుకుంటున్నారన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అసలు ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. శాఖాపరంగా ఏ మంత్రి ఒక్క అంశం పై మాటాడటం లేదని , బాబుని విమర్శించడమే మంత్రులకు పని అంటూ ఆయన అన్నారు. బస్సు యాత్రలని రాష్ర్టమంతా మంత్రులు తిరుగుతున్నారు , రైతుల గూర్చి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అని కార్యక్రమం పెడుతున్నారని.. అధికారులను అడ్డంగా పెట్టుకొని పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నామన్నారు. కరువు జిల్లాగా ప్రకటించే సీఎం జగన్ జిల్లాలో అడుగుపెట్టాలన్నారు. ఇద్దరు మినిస్టర్లు , స్పీకర్ ఉండి ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రపుకొత్తూరు ఎడారి అయిపోయిందన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. నాలుగున్నర ఏండ్ల తరువాత నీరు అందించలేక పోవడం టీడీపీ వైఫల్యం అనటం చేతకానితనమన్నారు. ఎంతసేపు బాబుపై ఏం కేసులు వేయాలని ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
-
Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
-
High-Protein Moong Dal Sandwich Recipe: ప్రోటీన్ పవర్తో పెసరపప్పు శాండ్విచ్.. రుచి, ఆరోగ్యం రెండూ ఒకే వంటకంలో
-
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
-
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!