Gorantla Butchaiah Chowdary: సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సారి టికెట్ వచ్చేది ఎవరికి? సిట్టింగ్లకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.. అయితే, వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని వస్తున్న వదంతులు నేపధ్యంలో తనకే మళ్లీ టికెట్టు అని బుచ్చయ్య క్లారిటీ ఇచ్చారు.
Read Also: Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కరెంట్ కోతలతో పేద ప్రజలు. పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.. గతంలో 400 వచ్చే కరెంటు బిల్ ఇప్పుడు 1400 రూపాయలు వస్తుందని ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం హయంలో 35 లక్షల కరెంట్ కనెక్షన్లు ఇస్తే.. వైసీపీ హయాంలో కేవలం 8 లక్షలు కూడా ఇవ్వలేదని వివరించారు. మరోవైపు.. వారాహి యాత్ర కొనసాగుతుంది.. చంద్రబాబు యాత్ర.. లోకేష్ యాత్ర సాగుతుంది. అది ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ సర్కార్పై మండి పడుతుందని గుర్తుచేశారు.. నిధులన్నీ గోల్ మాల్ అయిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: V Madhusudhan Rao Shatajayanthi Celebrations: ఘనంగా విక్టరీ మధుసూదనరావు శతజయంతి వేడుకలు!
పవర్ కి కూడా హాలిడే ప్రకటించే దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తీవ్రమైన విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఈవేళ కరెంట్ కోతలతో గృహ వినియోగదారులతో పాటు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ వాతావరణం చూస్తుంటే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కరెంట్ పరిస్థితులు చుస్తే అప్రకటిత కోతలే మూడు నాలుగు గంటలు ఉంటున్నాయి. లోవోల్టెజ్ సమస్య తో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!