Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Response on Amit Shah’s attack on YSRCP Government: ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రమోట్ చేసుకుంటున్న విశాఖలో సభ ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ ఏకంగా హోం మంత్రి అమిత్ షాను సభకు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన ఆయన అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పై అమిత్ షా, నడ్డా విమర్శలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మాకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు లేవని, కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీతో నైనా సత్ససంబంధాలు కొనసాగించడం సహజం అని అన్నారు.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తే మేం మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తాం, షా, నడ్డా మీటింగ్ తర్వాత బీజేపీ కంటే టీడీపీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయిందన్న ఆయన అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక ఒకప్పుడు రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న అమర్నాథ్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కుపై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన హామీల వల్ల వచ్చిన ఎయిమ్స్, యూనివర్సిటీల గురించి చెబుతున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో ఒక్క కొత్త సంస్థ నైనా మంజూరు చేసిందా….? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!