Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Response on Amit Shah’s attack on YSRCP Government: ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రమోట్ చేసుకుంటున్న విశాఖలో సభ ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ ఏకంగా హోం మంత్రి అమిత్ షాను సభకు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన ఆయన అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పై అమిత్ షా, నడ్డా విమర్శలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మాకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు లేవని, కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీతో నైనా సత్ససంబంధాలు కొనసాగించడం సహజం అని అన్నారు.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తే మేం మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తాం, షా, నడ్డా మీటింగ్ తర్వాత బీజేపీ కంటే టీడీపీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయిందన్న ఆయన అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక ఒకప్పుడు రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న అమర్నాథ్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కుపై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన హామీల వల్ల వచ్చిన ఎయిమ్స్, యూనివర్సిటీల గురించి చెబుతున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో ఒక్క కొత్త సంస్థ నైనా మంజూరు చేసిందా….? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!