Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Response on Amit Shah’s attack on YSRCP Government: ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రమోట్ చేసుకుంటున్న విశాఖలో సభ ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ ఏకంగా హోం మంత్రి అమిత్ షాను సభకు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన ఆయన అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పై అమిత్ షా, నడ్డా విమర్శలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మాకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు లేవని, కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీతో నైనా సత్ససంబంధాలు కొనసాగించడం సహజం అని అన్నారు.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
Also Read
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తే మేం మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తాం, షా, నడ్డా మీటింగ్ తర్వాత బీజేపీ కంటే టీడీపీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయిందన్న ఆయన అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక ఒకప్పుడు రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న అమర్నాథ్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కుపై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన హామీల వల్ల వచ్చిన ఎయిమ్స్, యూనివర్సిటీల గురించి చెబుతున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో ఒక్క కొత్త సంస్థ నైనా మంజూరు చేసిందా….? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!