Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Response on Amit Shah’s attack on YSRCP Government: ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రమోట్ చేసుకుంటున్న విశాఖలో సభ ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ ఏకంగా హోం మంత్రి అమిత్ షాను సభకు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన ఆయన అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పై అమిత్ షా, నడ్డా విమర్శలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మాకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు లేవని, కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీతో నైనా సత్ససంబంధాలు కొనసాగించడం సహజం అని అన్నారు.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
Also Read
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తే మేం మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తాం, షా, నడ్డా మీటింగ్ తర్వాత బీజేపీ కంటే టీడీపీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయిందన్న ఆయన అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక ఒకప్పుడు రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న అమర్నాథ్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కుపై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన హామీల వల్ల వచ్చిన ఎయిమ్స్, యూనివర్సిటీల గురించి చెబుతున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో ఒక్క కొత్త సంస్థ నైనా మంజూరు చేసిందా….? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!