TDP-Janasena First List: టీడీపీ- జనసేన పార్టీల తొలి జాబితా.. చంద్రబాబు- పవన్ ఉమ్మడి ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ- జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు చోటు కల్పించారు. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతానికైతే 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి.
Read Also: Petrol Diesel Prices : ముడి చమురు ధరలో భారీ పతనం.. త్వరలో తగ్గనున్న పెట్రోల్ ధరలు
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
కాగా, గత కొద్ది రోజులుగా టీడీపీ- జనసేన పార్టీలు అభ్యర్థులపై కసరత్తులు చేస్తున్నాయి. ఇక, నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రూపొందించారు. ముఖ్యమైన నేతలతో చర్చించిన తర్వాత ఈ జాబితాను ఆయన రిలీజ్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలకు సంబంధించిన టిక్కెట్ల వ్యవహారం కూడా అక్కడి నేతలతో ప్రధానంగా చర్చించారు. పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున ఈసారి సర్దుకుపోవాలని వారికి చంద్రబాబు సూచించారు. అందుకు చాలా మంది నేతలు ఓకే చెప్పినట్లు టాక్. మరికొందరిని మాత్రం తప్పని పరిస్థితుల్లో పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్నారు. వైసీపీ నుంచి వచ్చి కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా కొందరికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల
ఇక, జనసేన ఆశించే స్థానాల్లో ఉన్న టీడీపీ నేతలకు కొందరికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు సూచించారు. మరి కొందరికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొన్ని స్థానాలకు మాత్రం ఫస్ట్ లిస్ట్లో అవకాశం లభించింది.
Read Also: US Road Accident: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అయితే, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ ను ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమన్నారు. అందులో భాగంగా అందరూ సహకరించాలి.. పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సముచితమైన స్థానం దక్కుతుందన్నారు. మనందరిది ఒకటే లక్ష్యం.. వైసీపీని ఓడించడమే.. అందరూ సమన్వయంతో కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని చంద్రబాబు- పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!