Tammineni Veerabhadram: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మేము ఒంటరిగా పోరాటం కోరుకున్నది కాదు.. మా మిత్రుత్వం కాంగ్రెస్ కాదనుకుంది.. అందుకే 19 నియోజకవర్గలో పోటీ చేశామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు అని తమ్మినేని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నవే.. బీఆర్ఎస్ ది అహంకార ధోరణి.. కుటుంబ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.. కేసీఆర్, కమ్యూనిస్టులను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేశారు అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
Also Read
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
మునుగోడు ఎన్నికల తర్వాతనే బీజేపీ డౌన్ ఫాల్ అయ్యింది అని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు సీట్ల సర్దుబాటులో తేడా రాలేదు అని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న మీకు.. దూరంగా ఉన్న మాకు పొత్తు ఏంటి అని బీఆర్ఎస్ అడిగింది.. కాంగ్రెస్ తోడ్పాటు లేకుండా బీజేపీని దేశం నుండి తప్పించలేము అని ఆయన పేర్కొన్నారు. సీపీఐ.. సీపీఎం ఇద్దరం పోటీ చేద్దాం అనుకున్నాం.. కానీ కాంగ్రెస్ అధిష్టానం చర్చల అంశం మొదలు పెట్టింది.. బీజేపీ లాంటి రాక్షసిని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ దయ్యం బెటర్ అనుకున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.
Read Also: Vadhuvu : ఓటీటీ లో కి రాబోతున్న అవికా గోర్ ‘వధువు’ వెబ్ సిరీస్..
బీజేపీకి భయపడి కేసీఆర్ దూరం చేశారు మమ్మల్ని అని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కామ్రేడ్స్ తో పొత్తు లేకుండ.. పీసీసీలో గ్రూపులలో ఎవరు అభ్యంతరం చెప్పారో తెలియదు.. కాంగ్రెస్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారా చెప్పండి అన్నారు.. ఖమ్మంలో సీటు లేకుండా పొత్తు ఉహించగలమా?.. త్రిపురలో పీసీసీకి మా సిట్టింగ్ కాంగ్రెస్ వదిలేశాము అని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆ త్యాగం ఎందుకు చేయదు కాంగ్రెస్ అని తమ్మినేని ప్రశ్నించారు. భట్టి కూడా పాలేరు, మిర్యాలగూడ ఒప్పుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గుర్తు చేశారు. పాలేరులో బలమైన నాయకుడు పొంగులేటి వచ్చారు ఇవ్వలేం అన్నారు.. ఏ సీటు ఇస్తారో చెప్పండి అంటే సమాధానం ఇవ్వలేదు.. వైరా, మిర్యాలగూడకి అంగీకారం కుదిరింది.. తర్వాత వైరా లేదు మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారు.. కురదు అని చెప్పామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!