ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి.. తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
పాలేరులో బలమైన నాయకుడు పొంగులేటి వచ్చారు ఇవ్వలేం అన్నారు.. ఏ సీటు ఇస్తారో చెప్పండి అంటే సమాధానం ఇవ్వలేదు.. వైరా, మిర్యాలగూడకి అంగీకారం కుదిరింది.. తర్వాత వైరా లేదు మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారు.. కురదు అని చెప్పామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీ రిజర్వేషన్ల పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడారు.. కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటుకు, నీళ్లకు మళ్ళీ కష్టాలు తప్పవని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శలు గుప్పించారు.