TPCC Mahesh Goud : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీష్ రావు నిరసన… మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు
- హరీష్ రావుకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
- కాళేశ్వరం నిర్మాణ సమయంలో మీడియాకు అనుమతినివ్వలేని బీఆర్ఎస్ – ఇప్పుడు చర్చకు సిద్ధమా?
- కాళేశ్వరం వైఫల్యంపై బీఆర్ఎస్ సమాధానం చెప్పగలదా? : మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్ అహర్నిశలు శ్రమిస్తున్న వేళ, హరీష్ రావు నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి హడావిడి చేయడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం వారి పనికి ఆటంకం కలిగించడమేనని ఆయన విమర్శించారు. కనీసం రక్షణ చర్యలకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ నేతలకు లేకపోవడం దారుణమని అన్నారు.
Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థకైనా అనుమతి ఇచ్చారా? మీ పాలనలో కిలోమీటర్ల దూరంలో మీడియాను నిలిపిన చరిత్ర మీది కాదా? ఇప్పుడు హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేయడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం? అంటూ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా అన్ని విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతుంటే, హరీష్ రావు మాత్రం ఎలాంటి దిశా నిర్దేశం లేకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రెండేళ్ల క్రితమే భారీ పెట్టుబడులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిన్నది? లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ ఎందుకు అర్ధాంతరంగా నిలిచిపోయింది? వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్లు నీట మునగడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా? అంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాము నిర్మించిన ప్రాజెక్ట్ పరాజయం పాలయినప్పటికీ, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. హరీష్ రావు ప్రజాసమస్యలపై గళమెత్తడంలో తప్పులేదు, కానీ సహాయక చర్యలకు అడ్డంకిగా మారేలా నిరసనలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. టన్నెల్ వద్ద అర్ధం లేని హడావిడి చేయడం, మీడియా ముందు ఫోటోలకు పోజులివ్వడం కాదు, బాధితులను కాపాడే చర్యలకు సహకరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Sikandar Teaser : ‘సికందర్’ టీజర్ విడుదల.. యాక్షన్తో పిచ్చెక్కించిన సల్మాన్..
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!