Harish Rao : తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి
- ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనం
- సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ
- రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు, సాగర్ జలాశయంలో నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ బలవంతంగా తరలించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చైతన్యం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్లో పవర్ స్టార్ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
నాగార్జున సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పటికీ, ఏపీ ఇష్టానుసారంగా నీటిని తరలించుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలిన నీటి నిల్వలు తగ్గిపోతున్నా, పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ మరింత నీటిని తరలించేందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై కేఆర్ఎంబీ పరిధిలో త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ మీటింగ్ జరగకపోవడం, కేంద్ర బోర్డు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.
CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు
ఏపీ దూకుడుకు, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెగబడ్డ ప్రభావం ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ కావడమేనని హరీష్ రావు ఆరోపించారు. వేసవి తాకిడి ప్రారంభమవకముందే తెలంగాణ రైతులు నీటి కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఏపీ సాగర్ ఆయకట్టుకు ముప్పుగా మారేలా నీటిని తరలిస్తుండటం సరికాదని, వెంటనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఈ దోపిడిని అడ్డుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగర్ లో నీటి మట్టం పడిపోతే, హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!