జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాని మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు.. ఒక వైపు మోడీ ప్రభుత్వాన్ని ఆయన పరిపాలనని ప్రశంసిస్తూనే మరోవైపు విమర్శలు కూడా గుప్పించారు.
Read Also: Sreemukhi: గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీముఖి
వివారాలలోకి వెళ్తే.. 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు విజయం పైన స్పందించిన శశిథరూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీ20 శిఖరాగ్ర సదస్సుని విజయవంతగా నిర్వహించడం నిజంగా భారత్ సాధించిన గొప్ప విజయమని ఆయన కొనియాడారు. ఓ వైపు మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపై నిలిపిందని ప్రశంసించించిన శశిథరూర్ మరో వైపు సాధించిన ఈ విజయం మోడీ ప్రభుత్వానికి ఆస్తిగా మారుతుందని విమర్శలు చేశారు. జీ20 సదస్సుకు జరిగే వరకు ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అందరూ అభిప్రాయ పడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రకటన అనివార్యమనే ధోరణిలో ఉన్నారు.. చైర్మన్ సారాంశంతో సదస్సు ముగుస్తుందని అనుకున్నారని శశిథరూర్ చెప్పారు. ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా దేశానికి దౌత్యపరమైన విజయమేనని ప్రశంసించారు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధకాండ ఎంతో సున్నితమైన అంశం ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదనుకున్నాయి.. కానీ ఎంతో చాకచక్యంగా భారత్ ఆ అంతరాన్ని తగ్గించేందుకు ఓ సూత్రాన్ని కనుగోనింది. ఇది నిజంగా ఓ అద్భుతమైన దౌత్య విజయం.. ఏకాభిప్రాయం సాధించడంలో అమితాబ్కాంత్ కృషి ఎనలేమిది అని ఎంపీ శశిథరూర్ అన్నారు. ఈ విజయం అధికారపార్టీ ఆస్తిగా మారబోతుంది అని ఆయన విమర్శించారు.