Spurious Liquor: కల్తీ మద్యం తాగి 37మంది మరణం.. పోలీసు శాఖ భారీ నిర్ణయం..
- బీహార్లో దారుణం
- కల్తీ మద్యం తాగి 37 మంది మృతి
- తాజాగా పలువురి పోలీసు సిబ్బంది సస్పెండ్
- ఉత్తర్ప్రదేశ్ నుంచి మద్యం వచ్చినట్లు విచారణలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సివాన్, సరన్, గోపాల్గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మూడు జిల్లాల్లో విషపూరితమైన మద్యం తాగి 37 మంది చనిపోయారని చెప్పారు. మష్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, భగవాన్పూర్ అవుట్పోస్ట్లో పోస్ట్ చేయబడిన మరో పోలీసు అధికారి తమ అధికార పరిధిలో అనుమానాస్పద మద్యం సేవించడం వల్ల మరణాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేయబడ్డారు. సరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మష్రాఖ్, భగవాన్పూర్ హాట్ల ఎస్హెచ్ఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా మఘర్, ఔరియా, ఇబ్రహీంపూర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వాచ్మెన్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ప్రాణాంతక రసాయనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇందులో కొరియర్ కంపెనీ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరుపుతామని డీఐజీ వెల్లడించారు.
READ MORE: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ఇదిలా ఉండగా.. అక్టోబరు 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను ఇటీవల సస్పెండ్ చేశారు. బిహార్లో మద్యం విక్రయాలపై 2016లోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE: Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్స్టార్
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!