Spurious Liquor: కల్తీ మద్యం తాగి 37మంది మరణం.. పోలీసు శాఖ భారీ నిర్ణయం..
- బీహార్లో దారుణం
- కల్తీ మద్యం తాగి 37 మంది మృతి
- తాజాగా పలువురి పోలీసు సిబ్బంది సస్పెండ్
- ఉత్తర్ప్రదేశ్ నుంచి మద్యం వచ్చినట్లు విచారణలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సివాన్, సరన్, గోపాల్గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మూడు జిల్లాల్లో విషపూరితమైన మద్యం తాగి 37 మంది చనిపోయారని చెప్పారు. మష్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, భగవాన్పూర్ అవుట్పోస్ట్లో పోస్ట్ చేయబడిన మరో పోలీసు అధికారి తమ అధికార పరిధిలో అనుమానాస్పద మద్యం సేవించడం వల్ల మరణాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేయబడ్డారు. సరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మష్రాఖ్, భగవాన్పూర్ హాట్ల ఎస్హెచ్ఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా మఘర్, ఔరియా, ఇబ్రహీంపూర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వాచ్మెన్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ప్రాణాంతక రసాయనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇందులో కొరియర్ కంపెనీ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరుపుతామని డీఐజీ వెల్లడించారు.
READ MORE: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
ఇదిలా ఉండగా.. అక్టోబరు 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను ఇటీవల సస్పెండ్ చేశారు. బిహార్లో మద్యం విక్రయాలపై 2016లోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE: Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్స్టార్
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..