Spurious Liquor: కల్తీ మద్యం తాగి 37మంది మరణం.. పోలీసు శాఖ భారీ నిర్ణయం..
- బీహార్లో దారుణం
- కల్తీ మద్యం తాగి 37 మంది మృతి
- తాజాగా పలువురి పోలీసు సిబ్బంది సస్పెండ్
- ఉత్తర్ప్రదేశ్ నుంచి మద్యం వచ్చినట్లు విచారణలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సివాన్, సరన్, గోపాల్గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మూడు జిల్లాల్లో విషపూరితమైన మద్యం తాగి 37 మంది చనిపోయారని చెప్పారు. మష్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, భగవాన్పూర్ అవుట్పోస్ట్లో పోస్ట్ చేయబడిన మరో పోలీసు అధికారి తమ అధికార పరిధిలో అనుమానాస్పద మద్యం సేవించడం వల్ల మరణాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేయబడ్డారు. సరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మష్రాఖ్, భగవాన్పూర్ హాట్ల ఎస్హెచ్ఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా మఘర్, ఔరియా, ఇబ్రహీంపూర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వాచ్మెన్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ప్రాణాంతక రసాయనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇందులో కొరియర్ కంపెనీ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరుపుతామని డీఐజీ వెల్లడించారు.
READ MORE: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
Also Read
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- E20 Petrol: E20 పెట్రోల్పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
- Bhojshala Case: భోజ్శాలలో నమాజ్కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇదిలా ఉండగా.. అక్టోబరు 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను ఇటీవల సస్పెండ్ చేశారు. బిహార్లో మద్యం విక్రయాలపై 2016లోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE: Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్స్టార్
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!