Spurious Liquor: కల్తీ మద్యం తాగి 37మంది మరణం.. పోలీసు శాఖ భారీ నిర్ణయం..
- బీహార్లో దారుణం
- కల్తీ మద్యం తాగి 37 మంది మృతి
- తాజాగా పలువురి పోలీసు సిబ్బంది సస్పెండ్
- ఉత్తర్ప్రదేశ్ నుంచి మద్యం వచ్చినట్లు విచారణలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సివాన్, సరన్, గోపాల్గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మూడు జిల్లాల్లో విషపూరితమైన మద్యం తాగి 37 మంది చనిపోయారని చెప్పారు. మష్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, భగవాన్పూర్ అవుట్పోస్ట్లో పోస్ట్ చేయబడిన మరో పోలీసు అధికారి తమ అధికార పరిధిలో అనుమానాస్పద మద్యం సేవించడం వల్ల మరణాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేయబడ్డారు. సరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మష్రాఖ్, భగవాన్పూర్ హాట్ల ఎస్హెచ్ఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా మఘర్, ఔరియా, ఇబ్రహీంపూర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వాచ్మెన్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ప్రాణాంతక రసాయనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇందులో కొరియర్ కంపెనీ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరుపుతామని డీఐజీ వెల్లడించారు.
READ MORE: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇదిలా ఉండగా.. అక్టోబరు 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను ఇటీవల సస్పెండ్ చేశారు. బిహార్లో మద్యం విక్రయాలపై 2016లోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE: Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్స్టార్
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!