Prabhas Support ‘Love Reddy’ : చిన్న సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఆదరించాలని కోరిన రెబల్స్టార్
- "లవ్ రెడ్డి" సినిమాకు ప్రభాస్ ఆదరణ
- ప్రోత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా తన మద్దతు
- ఆదరించాలని ప్రేక్షకులను కోరిన రెబల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించిన “లవ్ రెడ్డి” సినిమాకు ఓ ప్రముఖ హీరో ఆదరణ లభించింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రోత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా తన మద్దతు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ పేర్కొన్నాడు.
READ MORE: Vizianagaram: గుర్లలో అదుపులోకొచ్చిన డయేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేసిన రెబల్ స్టార్ ఆ చిత్రానికి అండంగా నిలవాలని తన అభిమానులను కోరాడు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు తమ సినిమాకు సపోర్ట్ చేయడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. హిరో మద్దతుపై సామాజిక సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Astrology: మే 9 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు