Sajjala Ramakrishna Reddy: సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
- ఇంటింటికి డబ్బులు
- పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం
- ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారు
- సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని… వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు. ఈ నాలుగు నెలల్లో వందమందికి పైగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు.శాంతిభద్రతలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదో జరుగుతుందని హెలికాప్టర్ పంపారు.. 5 నెలలు అయ్యింది ఏం పట్టుకున్నారని ప్రశ్నించారు. తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాన్ని చేశారంటూ మండిపడ్డారు. ఏదో ఒక అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు వచ్చేటట్లు ఉన్నాయి.. ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దోచుకుని జేబులు నింపు కుంటున్నారన్నారు. జగన్ సహా పార్టీ నేతలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమ కట్టడాలు చేయలేదు, కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారన్నారు.
Read Also: Vijayasai Reddy: 2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..
Also Read
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఋషి కొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పారు. అసెంబ్లీ భవనాలు చూస్తే ఆయన పాలన అర్థం అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వేల కోట్ల సంక్షేమంతో పోల్చుకోగలవా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదన్నారు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడన్నారు. రోజూ అప్పు చేస్తున్నారని, ఏమై పోతున్నాయని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయన్నారు. పార్టీ బలోపేతానికి, జవసత్వాలతో పార్టీ నిర్మాణం చేస్తామన్నారు. బలమైన పార్టీ కార్యకర్తలు గల పార్టీగా ఈసారి అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఈ నేలలో పుట్టినా చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదని విమర్శించారు. పటిష్టమైన కార్యకర్తలన్న పార్టీని సిద్ధం చేస్తున్నాం, ఇదే మా తొలిఅడుగు అని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం కూడా వైసీపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..