Vijayasai Reddy: 2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..
- 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయి
- ఎవరూ ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుంది
- ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని విమర్శలు చేశారని.. భూమన టీటీడీ ఛైర్మన్గా ఎంతో కృషి చేశారన్నారు. కీలకమైన జిల్లాకు ఆయన అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. వచ్చే ఎన్నికలలో14 స్థానాలకు 14 స్దానాల్లో గెలిచేలా భూమన కృషి చేస్తారని చెప్పారు. మళ్ళీ 2027లో ఊహించని విజయం సాధిస్తామన్నారు. అందరినీ ఈసారి కలుపుకుని విజయం సాధిస్తామన్నారు.
Read Also: Guntur: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిదిపై దాడి
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
జగన్ ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారని.. ఈ రోజు ప్రజలకు సంక్షేమం దూరం అయ్యిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడిను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. విశాఖకు వెళ్లి రుషికొండ నిర్మాణాలను చూస్తున్నారన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులను నిర్మాణము చేస్తే ప్రవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామన్నారు. 2027 లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్ళీ మన నాయకుడు జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమనదేనని వ్యాఖ్యానించారు. ఆయనలో ఉన్న నాయకత్వ పటిమతో రాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతామన్నారు.
తాజావార్తలు
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!