Vijayasai Reddy: 2027 ఆఖరిలో మళ్లీ ఎన్నికలు.. ఊహించని విజయం సాధిస్తాం..
- 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయి
- ఎవరూ ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుంది
- ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని విమర్శలు చేశారని.. భూమన టీటీడీ ఛైర్మన్గా ఎంతో కృషి చేశారన్నారు. కీలకమైన జిల్లాకు ఆయన అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. వచ్చే ఎన్నికలలో14 స్థానాలకు 14 స్దానాల్లో గెలిచేలా భూమన కృషి చేస్తారని చెప్పారు. మళ్ళీ 2027లో ఊహించని విజయం సాధిస్తామన్నారు. అందరినీ ఈసారి కలుపుకుని విజయం సాధిస్తామన్నారు.
Read Also: Guntur: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిదిపై దాడి
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
జగన్ ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారని.. ఈ రోజు ప్రజలకు సంక్షేమం దూరం అయ్యిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడిను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. విశాఖకు వెళ్లి రుషికొండ నిర్మాణాలను చూస్తున్నారన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులను నిర్మాణము చేస్తే ప్రవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామన్నారు. 2027 లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్ళీ మన నాయకుడు జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమనదేనని వ్యాఖ్యానించారు. ఆయనలో ఉన్న నాయకత్వ పటిమతో రాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతామన్నారు.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!