RSS Meeting: పూణేలో RSS సమన్వయ సమావేశం.. ఐదు అంశాలపై చర్చ
పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ మీటింగ్ 2023 జరుగుతోంది. ఈ సమావేశానికి 36 సంస్థలకు చెందిన 266 మంది ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవన విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి పట్టుబట్టడం, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులను నెరవేర్చడం వంటి ఐదు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేద్కర్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ దేశానికి సేవ చేయడంలో సంఘ్ వాలంటీర్లు నిమగ్నమై ఉన్నారని.. సామాజిక జీవితంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ పనులన్నీ దేశ సేవ, అభివృద్ధి కోసమేనని ఆయన అన్నారు.
MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
Also Read
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
- Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
- Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
ఆర్ఎస్ఎస్ సమావేశం ఏడాదికి ఒకసారి జరుగుతుందని సునీల్ అంబేద్కర్ చెప్పారు. అందులో తమ పని, అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. ఆర్ఎస్ఎస్తో చాలా సంస్థలు కలిసి పనిచేస్తాయని.. ఈ సమావేశంలో అనేక రకాల సమిష్టి పని గురించి చర్చిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. వాటిని సంకలనం చేయడం ద్వారా.. ఒక దిశను నిర్ణయించడం, జాతీయ స్ఫూర్తితో పని చేయడం ద్వారా పని వేగం పెరుగుతుందని తెలిపారు. దాదాపు అన్ని రంగాలలో పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారని సునీల్ అంబేద్కర్ చెప్పారు. ఈ సంస్థలన్నీ చాలా సంవత్సరాలుగా సామాజిక జీవితంలో చురుకుగా ఉన్నాయని.. వారి కృషితో వారు తమ తమ రంగాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సృష్టించారని పేర్కొన్నారు.
Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
ఈ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జాతీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తమ అనుభవాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన అనేక అంశాలపై, సంస్థ యొక్క భవిష్యత్తు దిశ గురించి ప్రాథమిక ఆలోచన ఉంటుందని చెప్పారు. వారు తమ తమ రంగాలలో ఏమి అనుకున్నారో వారి ప్రణాళికలను కూడా పంచుకుంటారని సునీల్ పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ శాఖలతోపాటు విద్యాభారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షం, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, సేవాభారతి, విశ్వహిందూ పరిషత్తోపాటు సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్జీ భగవత్, సర్కార్యవహ్ దత్తాత్రేయ జీ హోసబాలే, సహ సర్కార్యవాహులు సేవికా సమితి, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ మరియు ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
తాజావార్తలు
-
Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
-
Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
-
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
-
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!