MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sanjay Singh: అనంత్నాగ్ ఎన్కౌంటర్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. మోడీ జీ20 వేడుకలు జరుపుకున్నారని మండిపడ్డారు. సైన్యానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడానికి ప్రధానికి 2 నిమిషాల సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పుకుంటున్నారని.. అయినప్పటికీ కొన్నిసార్లు పుల్వామాలో మరికొన్నిసార్లు అనంత్నాగ్లో సైనికులు అమరులయ్యారని చెప్పారు. ప్రధానికి భారత సైనికులపై కనికరం లేదని అన్నారు.
Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలు చుట్టూ పడి ఉన్నాయని.. ఆ సమయంలో ప్రధాని బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారని సంజయ్ సింగ్ గుర్తుచేశారు. దేశ భద్రతతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం సంతాపం తెలిపేందుకు సిద్ధంగా లేదని దేశ ప్రజలు తెలుసుకోవాలన్నారు. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు ప్రధాని తగిన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్లో లేవనెత్తుతుందని చెప్పారు.
Read Also: Meenakshi Chaudhary: నక్కతోక తొక్కావా ఏంది? అప్పుడే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టావ్?
ఇదిలా ఉంటే.. సనాతన్ వివాదంపై సంజయ్ సింగ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. సనాతన్, హిందూ మతం గురించి మోడీ.. హిందూ మతం లేదు అని చెబుతున్నాడని.. సనాతన్పై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. అన్ని మతాల మధ్య సమన్వయం, సౌభ్రాతృత్వం ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్పారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో బీజేపీ.. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై విమర్శల దాడికి దిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!