MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sanjay Singh: అనంత్నాగ్ ఎన్కౌంటర్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. మోడీ జీ20 వేడుకలు జరుపుకున్నారని మండిపడ్డారు. సైన్యానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడానికి ప్రధానికి 2 నిమిషాల సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పుకుంటున్నారని.. అయినప్పటికీ కొన్నిసార్లు పుల్వామాలో మరికొన్నిసార్లు అనంత్నాగ్లో సైనికులు అమరులయ్యారని చెప్పారు. ప్రధానికి భారత సైనికులపై కనికరం లేదని అన్నారు.
Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలు చుట్టూ పడి ఉన్నాయని.. ఆ సమయంలో ప్రధాని బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారని సంజయ్ సింగ్ గుర్తుచేశారు. దేశ భద్రతతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం సంతాపం తెలిపేందుకు సిద్ధంగా లేదని దేశ ప్రజలు తెలుసుకోవాలన్నారు. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు ప్రధాని తగిన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్లో లేవనెత్తుతుందని చెప్పారు.
Read Also: Meenakshi Chaudhary: నక్కతోక తొక్కావా ఏంది? అప్పుడే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టావ్?
ఇదిలా ఉంటే.. సనాతన్ వివాదంపై సంజయ్ సింగ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. సనాతన్, హిందూ మతం గురించి మోడీ.. హిందూ మతం లేదు అని చెబుతున్నాడని.. సనాతన్పై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. అన్ని మతాల మధ్య సమన్వయం, సౌభ్రాతృత్వం ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్పారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో బీజేపీ.. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై విమర్శల దాడికి దిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..