Jaipur Train Firing: జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నాట్లు ఓవైసీ పేర్కొన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది.. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్యాగ్ చేశారు.
Read Also: Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్ చేరుకున్న సమయంలో.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఫైరింగ్ జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్ అధికారి ఏఎస్సైఐ టికా రామ్ మీనాతో పాటు మరో ముగ్గురు కూడా మృతి చెందారు. ఆపై దహిసర్ స్టేషన్ దగ్గర రైలు దూకి చేతన్ సింగ్ పారిపోయాడు. కాగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షార్ట్టెంపర్తోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. మరోవైపు ఉగ్రదాడి కోణం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
Read Also: IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. సిరీస్ కోసం పోటాపోటీ
అయితే, కర్ణాటక కు చెందిన సయ్యద్ హైదరాబాద్ నాంపల్లిలో నివాసం ఉంటున్నారు. గుజరాత్ గల్లీలోని ఓ మొబైల్ షాపులో ఉద్యోగిగా సయ్యద్ పనిచేస్తున్నాడు. అజ్మీర్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి దేహాన్ని మృతుడి స్వస్థలం బీదర్ కు తరలించనున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!