Rohit Sharma: ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలో ఆడటానికేనా..?
- వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ
- సెంటర్ వికెట్పై బ్యాటింగ్ చేస్తూ కనిపించిన రోహిత్
- బ్యాటింగ్ చేస్తూ కనిపించిన అజింక్య రహానే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా టూర్లో బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీ రెండింటిలోనూ విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ప్రస్తుతం కష్టంగా ఉంది. రోహిత్ శర్మ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో.. రోహిత్ తన కెరీర్ ను కాపాడుకోవడానికి నరకయాతన పడుతున్నాడు. తన ఫామ్పై విమర్శలు వెల్లువెత్తడంతో రోహిత్ శర్మ దానిపై కసరత్తు ప్రారంభించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. అతని బ్యాటింగ్పై ప్రశ్నలు తలెత్తాయి. మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే అతని ఫ్యాన్స్ రిటైర్మెంట్ ప్రకటించద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏదేమైనాప్పటికీ.. రిటైర్మెంట్ ప్రకటించలేదు.
Sankranthi Celebrations: కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్న అతిధులు..
Also Read
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న రోహిత్.. ఇప్పుడు అన్నీ పనులు వదిలేసి మైదానంలోకి దిగి మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో అతను సెంటర్ వికెట్పై బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతనితో పాటు టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే కూడా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. రోహిత్ తన బ్లూ కలర్ కారులో వాంఖడే స్టేడియానికి వచ్చాడు. రోహిత్ వైట్ డ్రస్తో బ్యాగ్, కిట్బ్యాగ్తో కనిపించాడు. ఆ సమయంలో అక్కడి చేరుకున్న తన ఫ్యాన్స్ ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
రోహిత్ ఇటీవల బీసీసీఐ సమావేశానికి హాజరయ్యాడు. ఆ సమావేశంలో జట్టు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఉన్నారు. ఈ సమావేశంలో దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్లపై దృష్టి సారించారు. అయితే.. రోహిత్ శర్మ ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసాడు కాబట్టి.. అతను రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్లో ఆడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ ఆడతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే అతను మళ్లీ ఫామ్లోకి రావడంపై ఫోకస్ పెట్టాడు.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!