Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి పది పనులు చేస్తున్నప్పుడు ఒకటో రెండో తప్పులు దొర్లడం సహజమే.. మనమంతా మానవ మాత్రులమే అన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు బోయిన్ పల్లిలో జరిగిన పార్టీ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జానారెడ్డి, భట్టి, మధుయాష్కీ, సంపత్ మాటలను సూచనలను స్వాగతిస్తున్నాం. ఆచరిద్దామన్నారు. జానారెడ్డి సూచనలు సలహాలతో పార్టీని మూలములకు తీసుకెళ్దామని, ప్రజలకు నష్టం జరిగే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ ప్రజలను నయవంచన చేస్తున్నాడన్నారు. కేసీఆర్ నాయకత్వములో దగా పడని వర్గం దోపిడీకి గురికాని వర్గం లేదని, కేసీఆర్ పాలనలో అడుగడుగునా భయం ఉందన్నారు. పోలవరం మీద కేసీఆర్ విధానం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పొక్క మీద ని విధానం ఏంటని, కృష్ణ.. గోదావరి జలాల విధానంలో ఎవరి వైపు అని ఆయన అన్నారు. ఏపీలో తల మాసిన కొందరిని కేసీఆర్ చేర్చుకున్నారన్న రేవంత్.. ఏపీ ఆస్తులు.. విద్యుత్ బకాయిలలో కేసీఆర్ ఎవరి పక్షమన్నారు.
Also Read : Gautham Gambhir: ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. ఆటగాళ్లపై పనిభారం తగ్గించాలి
తెలంగాణ వైపా.. ఆంధ్ర వైపా అని ఆయన ప్రశ్నించారు. చెప్పు కేసీఆర్ అంటూ ఆయన ప్రసంగించారు. అన్ని త్యాగాలు చేసి కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చిందని, ఇప్పుడు కేసీఆర్ ఆంధ్ర గట్టునెక్కి నిలబడ్డాడన్నారు. ఐపీఎస్ లలో తెలంగాణ వాళ్లకి న్యాయంగా పోస్టింగ్లు దక్కాయా అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్ తెలంగాణకు సీఎస్.. ఏపీకి కేటాయించిన అంజనీకుమారు తెలంగాణకు డీజీపీ.. ఇదేనా తెలంగాణ అధికారులకు ఇచ్చిన గౌరవమన్నారు. మనలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చని, కానీ తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉన్న సమస్యలతో పోలిస్తే మన సమస్యలు పెద్ద సమస్యలు కావని, ప్రజల ఆవేదన దుఃఖముందు మనవి చాలా చిన్నవన్నారు. పార్టీ అధికారం లోకి రావాలంటే.. పదవిని కూడా వదిలేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని కూర్చోపెట్టినా పల్లకీ మోస్తానని, నేను త్యాగం చేస్తే కాంగ్రెస్ అధికారంలో కి వస్తది అంటే… నేను రెడీ అని ఆయన అన్నారు. మాట వరుసకు చెప్పడం లేదని ఆయన వెల్లడించారు.
Also Read : OFF The Record: ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు మధ్య వైరం.. కారణం ఏంటి ?
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!