Tejaswi Yadav: సుప్రీంకోర్టులో తేజస్వి యాదవ్కు రిలీఫ్.. పరువు నష్టం కేసులో స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో తేజస్వి యాదవ్ గుజరాతీలను దుండగులు అని వ్యాఖ్యానించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఇదిలా ఉంటే.. అంతకుముందు తనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు అహ్మదాబాద్ కోర్టుకు తేజస్వి యాదవ్ తెలిపారు. తన న్యాయవాది ద్వారా అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ DJ పర్మార్ కోర్టులో హాజరు నుండి మినహాయింపు కోసం అభ్యర్థించారు. ఈ కేసుపై తేజస్వి యాదవ్ పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు కాగా.. సెప్టెంబర్లో అహ్మదాబాద్ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో కోర్టు ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
శనివారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.. అయితే తేజస్వి గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. అయితే తేజస్వి గైర్హాజరీలో కూడా కేసు విచారణ జరపాలని ఫిర్యాదుదారు తెలిపారు. మరోవైపు బీహార్ డిప్యూటీ సిఎం అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని తేజస్వి తరపున కోర్టుకు హాజరైన లాయర్ పిటిషన్ ద్వారా తెలిపారు. కేసును బదిలీ చేయాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 406 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యమైన, అధికారిక కార్యక్రమాల కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని తేజస్వి పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!