Tejaswi Yadav: సుప్రీంకోర్టులో తేజస్వి యాదవ్కు రిలీఫ్.. పరువు నష్టం కేసులో స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో తేజస్వి యాదవ్ గుజరాతీలను దుండగులు అని వ్యాఖ్యానించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
Also Read
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
- JP Nadda: "ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే".. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
ఇదిలా ఉంటే.. అంతకుముందు తనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు అహ్మదాబాద్ కోర్టుకు తేజస్వి యాదవ్ తెలిపారు. తన న్యాయవాది ద్వారా అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ DJ పర్మార్ కోర్టులో హాజరు నుండి మినహాయింపు కోసం అభ్యర్థించారు. ఈ కేసుపై తేజస్వి యాదవ్ పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు కాగా.. సెప్టెంబర్లో అహ్మదాబాద్ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో కోర్టు ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
శనివారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.. అయితే తేజస్వి గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. అయితే తేజస్వి గైర్హాజరీలో కూడా కేసు విచారణ జరపాలని ఫిర్యాదుదారు తెలిపారు. మరోవైపు బీహార్ డిప్యూటీ సిఎం అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని తేజస్వి తరపున కోర్టుకు హాజరైన లాయర్ పిటిషన్ ద్వారా తెలిపారు. కేసును బదిలీ చేయాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 406 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యమైన, అధికారిక కార్యక్రమాల కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని తేజస్వి పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
-
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?