Tejaswi Yadav: సుప్రీంకోర్టులో తేజస్వి యాదవ్కు రిలీఫ్.. పరువు నష్టం కేసులో స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో తేజస్వి యాదవ్ గుజరాతీలను దుండగులు అని వ్యాఖ్యానించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
ఇదిలా ఉంటే.. అంతకుముందు తనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు అహ్మదాబాద్ కోర్టుకు తేజస్వి యాదవ్ తెలిపారు. తన న్యాయవాది ద్వారా అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ DJ పర్మార్ కోర్టులో హాజరు నుండి మినహాయింపు కోసం అభ్యర్థించారు. ఈ కేసుపై తేజస్వి యాదవ్ పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు కాగా.. సెప్టెంబర్లో అహ్మదాబాద్ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో కోర్టు ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
శనివారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.. అయితే తేజస్వి గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. అయితే తేజస్వి గైర్హాజరీలో కూడా కేసు విచారణ జరపాలని ఫిర్యాదుదారు తెలిపారు. మరోవైపు బీహార్ డిప్యూటీ సిఎం అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని తేజస్వి తరపున కోర్టుకు హాజరైన లాయర్ పిటిషన్ ద్వారా తెలిపారు. కేసును బదిలీ చేయాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 406 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యమైన, అధికారిక కార్యక్రమాల కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని తేజస్వి పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!