Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..
- ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పారిపోయిన అత్యాచార దోషి
- జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ
- జార్ఖండ్ హజారీబాగ్లోని షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఘటన
- గత 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దోషి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని హజారీబాగ్లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హజారీబాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ కుమార్ సింగ్, సబ్ డివిజనల్ ఆఫీసర్ (SDO) మరియు ఇతర అధికారులతో కలిసి విచారణను పర్యవేక్షించేందుకు ఆసుపత్రికి వచ్చారు. విచారణలో భాగంగా.. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు. పారిపోయిన దోషిని పట్టుకోవడానికి ఆ ప్రాంతం అంతటా పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Read Also: Wayanad landslides: 130 మంది జాడ మిస్సింగ్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
ధన్బాద్కు చెందిన నిందితుడు షాహిద్ అన్సారీని ధన్బాద్ జైలు నుంచి హజారీబాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతనిపై ధన్బాద్లో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక కేసు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద ఉల్లంఘనలతో సహా అనేక తీవ్రమైన నేరాలు అభియోగాలు ఉన్నాయి. మరొకటి హత్య, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో ఉన్నాడు. ఈ క్రమంలో.. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
Read Also: CM Chandrababu: టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలి..
కాగా.. దోషి అన్సారీ శరీరం కుడి వైపున తిమ్మిరిలు వస్తున్నాయని.. గత 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతను AIIMSలో చికిత్స చేయించాలని కోరగా, షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే.. మెడికల్ కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా, అన్సారీ సెక్యూరిటీపై దాడి చేసి బయటకు పారిపోయినట్లు కనిపించింది. అతను తప్పించుకునే సమయంలో ఆసుపత్రి లోపల భద్రతా సిబ్బంది ఎవరూ లేరు. కాగా.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!