Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajnath Singh Run Samvad 2025 Operation Sindhoor India Defence Readiness

Rajnath Singh: సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలి.. యుద్ధాలపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Published Date :August 27, 2025 , 6:22 pm
By Shiva Ganesh
Rajnath Singh: సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలి.. యుద్ధాలపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajnath Singh: మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో బుధవారం నిర్వహించిన త్రివిధ దళాల ఉమ్మడి సింపోజియం ‘రణ్ సంవాద్ 2025’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా జరుగుతాయో వివరించారు. భారతదేశం ఎప్పుడూ ముందుగా దాడి చేయదని, కానీ సవాలు చేస్తే దానికి పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ భద్రత ఇకపై కేవలం సైన్యం విషయం కాదని, అది మొత్తం దేశం దృక్పథానికి సంబంధించిన సమస్యగా మారిందని అన్నారు. భారతదేశం ఏ దేశంపైనా యుద్ధాన్ని కోరుకోదని, కానీ దాని భద్రత కోసం పూర్తి శక్తితో స్పందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

READ ALSO: India CWG Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

ఆపరేషన్ సింధూర్..
ఈసందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో త్రివిధ దళాల ఉమ్మడి కృషి గొప్పదని అన్నారు. ఈ యుద్ధంలో భారతదేశ స్వదేశీ పరికరాలు, ఆయుధ వ్యవస్థల పని తీరు ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో సాధించిన విజయాల లాంటివి రాబోయే కాలంలో కూడా మనకు చాలా అవసరం అన్నారు. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు ఎంత కచ్చితత్వంతో, ధైర్యంగా, వేగంగా దాడులు చేశాయో ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ప్రపంచం చూసిందన్నారు. ఈ ఆపరేషన్‌ను ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేనిదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ నిజంగా సాంకేతికత ఆధారిత యుద్ధానికి అద్భుతమైన ఉదాహరణ అని అన్నారు.

వీటితోనే రక్షణ సామర్థ్యాలు బలోపేతం..
ఆధునిక యుద్ధం కేవలం సైనిక శక్తిపై ఆధారపడి ఉండదని అన్నారు. సాంకేతికత, నిఘా, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన దౌత్యం కూడా యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. శిక్షణ, సాంకేతిక పురోగతి, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోగలదని, ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలదని స్పష్టం చేశారు. అన్ని రకాల భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సైనికులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. భౌగోళిక రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారిందని, సైన్యం ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నేటి యుగంలో యుద్ధాలు చాలా అకస్మాత్తుగా, అనూహ్యంగా మారాయని చెప్పారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమని అన్నారు. అందుకే యుద్ధం రెండు నెలలు, నాలుగు నెలలు, ఏడాది, రెండు సంవత్సరాలు లేదా ఐదేళ్లు కొనసాగినా దానికి సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. భారత్ ఎవరి భూమిని కోరుకోదని, కానీ దాని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో త్రివిధ దళాల అగ్ర నాయకత్వం, రక్షణ నిపుణులు, అంతర్జాతీయ భద్రతా నిపుణులు పాల్గొన్నారు.

READ ALSO: Pixel Dhruva Space Mission: సుంకాల పెంపు వేళ.. అమెరికా గడ్డపై భారత్ జెండా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • future wars India
  • India defence strategy
  • Indian armed forces readiness
  • Indian military technology
  • modern warfare India

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions