Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత శుక్రవారం, లోక్సభ సెక్రటేరియట్ మార్చి 23 నుంచి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. వెంటనే బెయిల్ ఇస్తూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.
“ఆయన లోక్సభ నుండి అనర్హుడయ్యాడు కాబట్టి, అతను ప్రభుత్వ వసతికి అర్హుడు కాదు. నిబంధనల ప్రకారం, అనర్హత ఉత్తర్వుల తేదీ నుంచి ఒక నెలలోపు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది” అని కేంద్ర గృహ మంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన అధికారిక లోధీ ఎస్టేట్ బంగ్లాను జూలై 2020లో ఖాళీ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెకు ప్రత్యేక భద్రతా దళ (ఎస్పీజీ) భద్రతను వెనక్కు తీసుకుని, జెడ్ ప్లస్ భద్రత కల్పించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
Read Also: Disqualified MLAs-MPs: రాహుల్ గాంధీ కంటే ముందు సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే..
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్.. ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొంది. చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ చర్య రాజకీయ ప్రతీకారమేనని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. నిజం మాట్లాడినందున ఆయనపై అనర్హత వేటు వేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నిజం మాట్లాడినందుకు, రాజ్యాంగం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఆయనను సభ నుంచి తొలగించారని ఖర్గే ఆరోపించారు.
తాజావార్తలు
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!