Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత శుక్రవారం, లోక్సభ సెక్రటేరియట్ మార్చి 23 నుంచి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. వెంటనే బెయిల్ ఇస్తూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.
“ఆయన లోక్సభ నుండి అనర్హుడయ్యాడు కాబట్టి, అతను ప్రభుత్వ వసతికి అర్హుడు కాదు. నిబంధనల ప్రకారం, అనర్హత ఉత్తర్వుల తేదీ నుంచి ఒక నెలలోపు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది” అని కేంద్ర గృహ మంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన అధికారిక లోధీ ఎస్టేట్ బంగ్లాను జూలై 2020లో ఖాళీ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెకు ప్రత్యేక భద్రతా దళ (ఎస్పీజీ) భద్రతను వెనక్కు తీసుకుని, జెడ్ ప్లస్ భద్రత కల్పించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also: Disqualified MLAs-MPs: రాహుల్ గాంధీ కంటే ముందు సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే..
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్.. ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొంది. చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ చర్య రాజకీయ ప్రతీకారమేనని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. నిజం మాట్లాడినందున ఆయనపై అనర్హత వేటు వేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నిజం మాట్లాడినందుకు, రాజ్యాంగం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఆయనను సభ నుంచి తొలగించారని ఖర్గే ఆరోపించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!