Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత శుక్రవారం, లోక్సభ సెక్రటేరియట్ మార్చి 23 నుంచి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. వెంటనే బెయిల్ ఇస్తూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.
“ఆయన లోక్సభ నుండి అనర్హుడయ్యాడు కాబట్టి, అతను ప్రభుత్వ వసతికి అర్హుడు కాదు. నిబంధనల ప్రకారం, అనర్హత ఉత్తర్వుల తేదీ నుంచి ఒక నెలలోపు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది” అని కేంద్ర గృహ మంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన అధికారిక లోధీ ఎస్టేట్ బంగ్లాను జూలై 2020లో ఖాళీ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెకు ప్రత్యేక భద్రతా దళ (ఎస్పీజీ) భద్రతను వెనక్కు తీసుకుని, జెడ్ ప్లస్ భద్రత కల్పించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
Read Also: Disqualified MLAs-MPs: రాహుల్ గాంధీ కంటే ముందు సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే..
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్.. ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొంది. చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ చర్య రాజకీయ ప్రతీకారమేనని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. నిజం మాట్లాడినందున ఆయనపై అనర్హత వేటు వేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నిజం మాట్లాడినందుకు, రాజ్యాంగం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఆయనను సభ నుంచి తొలగించారని ఖర్గే ఆరోపించారు.
తాజావార్తలు
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!