Kerala Politics: ‘బీజేపీతో పొత్తుకు పినరయి విజయన్ గ్రీన్సిగ్నల్’.. మాజీ ప్రధాని ప్రకటనపై దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Politics: మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, సత్యానికి మించినవని విజయన్ అన్నారు. జేడీఎస్ ప్రయోజనాలను కాపాడేందుకే కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు సీఎం పినరయి విజయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది. మాజీ ప్రధాని తన ప్రకటనను సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.
Also Read: Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
దేవెగౌడ ప్రకటనపై సీఎం విజయన్ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తును తాము స్పష్టంగా వ్యతిరేకిస్తున్నామని, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్తో తాము గట్టిగా నిలబడతామని జేడీఎస్ రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు ద్రోహం చేశారని పినరయి విజయన్ ఆరోపించారు. కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కి జేడీ(ఎస్) చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ ఉద్ఘాటించారు. జాతీయ నాయకత్వం భిన్నమైన వైఖరిని ప్రకటించినప్పటికీ, ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను జేడీ(ఎస్) రాష్ట్ర నాయకత్వం కొనసాగించిందని ఆయన ప్రశంసించారు. జేడీ(ఎస్) అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఐ(ఎం) కానీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
Also Read: RBI Governor: లోన్లు తీసుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్.. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడి
సీపీఎం, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై దాడి చేసిన విజయన్.. తమను తాము మోసం చేసుకోవద్దని కాంగ్రెస్ను కోరారు. పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!