Crime: దారుణం.. ఫొటోషూట్ అని పిలిచి కెమెరాల కోసం యువకుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: పొటోషూట్ పేరుతో రప్పించి కెమెరాల ఓ యువ ఫొటోగ్రాఫర్ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ పోలీసుల ప్రకారం.. విశాఖలోని మధురవాడ చెందిన పోతిన సాయి కుమార్ పెళ్లి వేడుకలకు ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకొని స్థానిక ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి ఈవెంట్లలో ఫొటోలు తీస్తూ ఉంటాడు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పది రోజుల ఫొటోషూట్ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్ను పిలిచారు. ఈ క్రమంలో తన వద్దనున్న రూ.15 లక్షల విలువైన కెమెరా, సామగ్రితో అతను వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫొటోల చిత్రీకరణకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.
Read Also: Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం..170 మంది దారుణ హత్య..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
సాయికుమార్ అక్కడికి ఒంటరిగా వెళ్లగా.. ఆ ఇద్దరు వ్యక్తులు అతడిని హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సాయికుమార్ దగ్గరున్న కెమెరా, సామగ్రిని తీసుకెళ్లారు. మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు పోలీసులు విచారణ చేపట్టారు. సాయికుమార్ కాల్డేటా ఆధారంగా విచారణ చేపట్టగా.. నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు అతడి కెమెరా, సామగ్రి కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
విశాఖ యువకుడి హత్యపై మృతుడి తల్లి రమణమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని మృతుడి తల్లి పోతిన రమణమ్మ డిమాండ్ చేశారు. మైనర్లు అయి ధైర్యంగా హత్య చేసారంటే వారు ఎంతటి వారో అర్థం చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!