Namburu Sankara Rao: పల్లెల్లో సంక్షేమం చూడండి… పరుగులు పెడుతున్న అభివృద్ధి చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సందోహం తరలి వచ్చింది. ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ.. మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Read Also: Indian 2 : ఇండియన్ 2 కోసం వాయిస్ ఓవర్ అందించనున్న ఆ స్టార్ హీరో..?
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. 75 త్యాళ్లూరులో జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. గ్రామంలో సుమారు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించినట్టు వివరించారు. గ్రామంలో సుమారు రూ.1. 57 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు. నాడు- నేడు ద్వారా రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో సఫలమయ్యామన్నారు. సీఎం జగన్ పాలనలో అందరికీ మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చిన ఓట్లు అడుగుతున్నామని నంబురి శంకరరావు అన్నారు.
Read Also: Kedarnath: ఈనెల 10న తెరచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం
టీడీపీ నేతలు వారి పాలనలో ఏం మంచి చేశారో చెప్పి ఓట్లు అడగాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సూచించారు. 27 కోట్లతో ఆస్పత్రులు బాగు చేశామన్నారు. టీడీపీ హయాంలో ఒక్క ఆస్పత్రి బాగు చేశారా.. ఒక్క స్కూల్ బాగు చేశారా అని ప్రశ్నించారు. 2014లో పొత్తులు, బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మళ్లీ అదే కుట్రమార్గంలో మీ ముందుకు వస్తున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే.. పెత్తందార్ల పాలనతో పేదలు ఇబ్బందులు పడతారన్నారు. పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని నంబూరి శంకరరావు కోరారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..