Janasena : నేటి నుంచి రెండో విడత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర రెండవ దశను జూలై 9న ఏలూరు పట్టణంలో బహిరంగ సభతో ప్రారంభించనున్నారు. జూలై 6న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ అర్బన్, రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, నరసాపురం, రాజోలు, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు. పక్షం రోజుల పాటు సాగే వారాహి యాత్ర మొదటి పాద యాత్ర అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో దర్శనంతో ప్రారంభమై జూన్ 30న భీమవరం వద్ద ముగిసింది.
Also Read : CM KCR: పదవుల కోసం లీడర్లు పార్టీ మారుతున్నారు.. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కామెంట్స్
Also Read
కల్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన జగన్ ప్రభుత్వం ఆరోపించిన వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా పెట్టుకుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ, 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి, సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే.. 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం, సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు పవన్. 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Also Read : Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..
కాగా, తొలి దశ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా ఎవరినీ వదలకుండా విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కామెంట్లకు అదే స్థాయిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు పడ్డాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పవన్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. అయితే, ఎవ్వరు విమర్శించినా.. వారిపై మళ్లీ విమర్శలు గుప్పించారు జనసేనాని.. మరి రెండో దశ వారాహి విజయయాత్రలో ఎలాంటి.. అస్త్రాలు సంధిస్తారో.. వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, రేపు మరోసారి పార్టీ నేతలతో భేటీ కానున్నారు పవన్.. ఏలూరు సభ అనంతరం వారాహి యాత్ర రూట్ మ్యాప్ ఖరారుపై చర్చించనున్నారు.. దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో పర్యటన ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి జనసేన శ్రేణులు.
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?