PAK vs SL T20: శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు పాక్కి షాక్.. ప్రధాన ప్లేయర్స్ లేక కొత్త వారికి ఛాన్స్!
- శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కు కొత్త ఆటగాళ్లు..
- బిగ్ బ్యాష్ లీగ్లో ఆడేందుకు సంతకాలు చేసిన పాక్ ప్రధాన ప్లేయర్లు..
- క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చల తర్వాత కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్న పాక్ సెలక్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఉంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ను ప్రకటించక ముందే, ఆరుగురు ప్రధాన ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ 14 నుంచి జనవరి చివరి వరకు జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు ఎన్ఓసీ పత్రాలను పీసీబీ మంజూరు చేసింది. దీంతో బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లు బీబీఎల్లో పాల్గొంటున్నారు. డిసెంబర్ 2024 నుంచి జాతీయ టీ20 జట్టులో లేని మహ్మద్ రిజ్వాన్ను మినహాయిస్తే, మిగతా ఆటగాళ్లందరూ ప్రస్తుతం పాకిస్తాన్ టీ20 జట్టులో ఉన్నవారే.
Read Also: Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మొత్తం బీబీఎల్ సీజన్ కోసం పాకిస్థాన్ ప్లేయర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. డిసెంబర్- జనవరి చివరి వారం వరకు పాకిస్తాన్కు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు లేకపోవడంతో మొత్తం లీగ్ లో ఆడవచ్చని ఇరు బోర్డులు (ఆస్ట్రేలియా- పాకిస్థాన్) మధ్య ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. ఇప్పుడు పీసీబీ క్రికెట్ ఆస్ట్రేలియాతో మరోసారి చర్చలు జరిపి తమ ఆటగాళ్లను శ్రీలంక సిరీస్కు వెనక్కి పిలిపించాలని కోరే అవకాశం ఉందని టాక్. అలా, కుదరని పక్షంలో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కొత్త ముఖాలను శ్రీలంక సిరీస్కు పాకిస్థాన్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, గతంలో కూడా లీగ్లలో ఆడేందుకు సంతకం చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లను పీసీబీ అకస్మాత్తుగా వెనక్కి పిలవడంపై రచ్చ కొనసాగింది. అయితే, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, నసీమ్ షా లాంటి ఆటగాళ్లు ఎమిరేట్స్ లీగ్లో ఆడటానికి పీసీబీ అనుమతించినప్పటికీ, ఆ లీగ్ శ్రీలంకలో జరిగే మ్యాచ్ల కంటే ముందే ముగుస్తుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?