PAK vs SL T20: శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు పాక్కి షాక్.. ప్రధాన ప్లేయర్స్ లేక కొత్త వారికి ఛాన్స్!
- శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కు కొత్త ఆటగాళ్లు..
- బిగ్ బ్యాష్ లీగ్లో ఆడేందుకు సంతకాలు చేసిన పాక్ ప్రధాన ప్లేయర్లు..
- క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చల తర్వాత కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్న పాక్ సెలక్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఉంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ను ప్రకటించక ముందే, ఆరుగురు ప్రధాన ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ 14 నుంచి జనవరి చివరి వరకు జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు ఎన్ఓసీ పత్రాలను పీసీబీ మంజూరు చేసింది. దీంతో బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లు బీబీఎల్లో పాల్గొంటున్నారు. డిసెంబర్ 2024 నుంచి జాతీయ టీ20 జట్టులో లేని మహ్మద్ రిజ్వాన్ను మినహాయిస్తే, మిగతా ఆటగాళ్లందరూ ప్రస్తుతం పాకిస్తాన్ టీ20 జట్టులో ఉన్నవారే.
Read Also: Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మొత్తం బీబీఎల్ సీజన్ కోసం పాకిస్థాన్ ప్లేయర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. డిసెంబర్- జనవరి చివరి వారం వరకు పాకిస్తాన్కు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు లేకపోవడంతో మొత్తం లీగ్ లో ఆడవచ్చని ఇరు బోర్డులు (ఆస్ట్రేలియా- పాకిస్థాన్) మధ్య ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. ఇప్పుడు పీసీబీ క్రికెట్ ఆస్ట్రేలియాతో మరోసారి చర్చలు జరిపి తమ ఆటగాళ్లను శ్రీలంక సిరీస్కు వెనక్కి పిలిపించాలని కోరే అవకాశం ఉందని టాక్. అలా, కుదరని పక్షంలో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కొత్త ముఖాలను శ్రీలంక సిరీస్కు పాకిస్థాన్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, గతంలో కూడా లీగ్లలో ఆడేందుకు సంతకం చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లను పీసీబీ అకస్మాత్తుగా వెనక్కి పిలవడంపై రచ్చ కొనసాగింది. అయితే, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, నసీమ్ షా లాంటి ఆటగాళ్లు ఎమిరేట్స్ లీగ్లో ఆడటానికి పీసీబీ అనుమతించినప్పటికీ, ఆ లీగ్ శ్రీలంకలో జరిగే మ్యాచ్ల కంటే ముందే ముగుస్తుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..