Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
- ఎయిర్ లైన్స్ అమ్మకానికి పాక్ ప్రభుత్వం సిద్ధం..
- బిడ్డింగ్ లో పాకిస్తాన్ ఆర్మీ..
- దేశ రక్షణ తప్పా, అన్ని వ్యాపారాల్లో పాక్ సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Read Also: Joe Root: 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన జో రూట్.. తొలిరోజు ఆధిపత్యం ఇంగ్లాండ్దే
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA)ను పాక్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోంది. ఐఎంఎఫ్ షరతులకు లోబడి పీఐఏను పాక్ వదిలించుకోవాలని అనుకుంటోంది. ఎయిర్ లైన్లో 51 శాతం నుంచి 100 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. ఐఎంఎఫ్ రుణ ఒప్పందం ప్రకారం, గతంలో పాక్ 1 బిలియన్ డాలర్లు(రూ.9000 కోట్లు) అప్పు పొందింది. డిసెంబర్ 8న జరిగే సమావేశంలో 1.2 బిలియన్ డాలర్లు( రూ. 10,800 కోట్లు) అప్పుగా కోరబోతోంది. అయితే, ఈ అప్పును పొందాలంటే ఈ ఏడాది నాటికి పాక్ ఈ ఎయిర్ లైన్స్ టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలి.
పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ను టేకోవర్ చేయడానికి ప్రస్తుతం 4 కంపెనీలు పోటీలో ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. దీనిని నేరుగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నియంత్రిస్తాడు. ఈ కంపెనీ సైన్యం నియంత్రణలోని ఫౌజీ ఫౌండేషన్ కింద ఉంది. టెండర్లు వేసిన మిగిలిన 3 కంపెనీలు.. లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ పౌరులు లేదా కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టడంతో విదేశీ కంపెనీలు బిడ్డింగ్ లోకి రాలేదు. పీఐఏని అమ్మడం ద్వారా 8600 కోట్ల పాకిస్తానీ రూపాయలను సేకరించవచ్చు. ఇందులో పాక్ ప్రభుత్వానికి 15 శాతం వస్తుంది.
తాజావార్తలు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..