Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
- ఎయిర్ లైన్స్ అమ్మకానికి పాక్ ప్రభుత్వం సిద్ధం..
- బిడ్డింగ్ లో పాకిస్తాన్ ఆర్మీ..
- దేశ రక్షణ తప్పా, అన్ని వ్యాపారాల్లో పాక్ సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Read Also: Joe Root: 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన జో రూట్.. తొలిరోజు ఆధిపత్యం ఇంగ్లాండ్దే
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA)ను పాక్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోంది. ఐఎంఎఫ్ షరతులకు లోబడి పీఐఏను పాక్ వదిలించుకోవాలని అనుకుంటోంది. ఎయిర్ లైన్లో 51 శాతం నుంచి 100 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. ఐఎంఎఫ్ రుణ ఒప్పందం ప్రకారం, గతంలో పాక్ 1 బిలియన్ డాలర్లు(రూ.9000 కోట్లు) అప్పు పొందింది. డిసెంబర్ 8న జరిగే సమావేశంలో 1.2 బిలియన్ డాలర్లు( రూ. 10,800 కోట్లు) అప్పుగా కోరబోతోంది. అయితే, ఈ అప్పును పొందాలంటే ఈ ఏడాది నాటికి పాక్ ఈ ఎయిర్ లైన్స్ టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలి.
పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ను టేకోవర్ చేయడానికి ప్రస్తుతం 4 కంపెనీలు పోటీలో ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. దీనిని నేరుగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నియంత్రిస్తాడు. ఈ కంపెనీ సైన్యం నియంత్రణలోని ఫౌజీ ఫౌండేషన్ కింద ఉంది. టెండర్లు వేసిన మిగిలిన 3 కంపెనీలు.. లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ పౌరులు లేదా కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టడంతో విదేశీ కంపెనీలు బిడ్డింగ్ లోకి రాలేదు. పీఐఏని అమ్మడం ద్వారా 8600 కోట్ల పాకిస్తానీ రూపాయలను సేకరించవచ్చు. ఇందులో పాక్ ప్రభుత్వానికి 15 శాతం వస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!