Waqf Properties: సెంట్రల్ పోర్టల్ లో 200,000 కు పైగా వక్ఫ్ ఆస్తులకు ఆమోదం.. అప్ లోడ్స్ కు ముగిసిన గడువు
- సెంట్రల్ పోర్టల్ లో 200,000 కు పైగా వక్ఫ్ ఆస్తులకు ఆమోదం
- అప్ లోడ్స్ కు ముగిసిన గడువు
- 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోర్టల్లో ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమీద్ పోర్టల్లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోర్టల్లో ప్రారంభించారు. వీటిలో 216,905 ఆస్తులను నియమించిన అప్రూవర్లు ఆమోదించారు.
Also Read:Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
213,941 ఆస్తులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. వెరిఫికేషన్ సమయంలో, 10,869 ఆస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రిత్వ శాఖ వక్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం, ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 86,345 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కింద అప్ లోడ్ ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 52,917 ఆమోదించబడిన ఆస్తులు ఉన్నాయి. ఈ ప్రచారం సందర్భంగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర/యూటీ వక్ఫ్ బోర్డులు, మైనారిటీ విభాగాలతో నిరంతర వర్క్షాప్లు, శిక్షణా సెషన్లను నిర్వహించింది.
Also Read:Telangana Rising Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం
అప్లోడ్ ప్రక్రియపై వక్ఫ్ బోర్డులు, రాష్ట్ర/యూటీ అధికారులకు ఆచరణాత్మక శిక్షణ అందించడానికి ఢిల్లీలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్ వర్క్షాప్ కూడా జరిగింది. సీనియర్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ వివిధ రాష్ట్రాలకు పంపించారు. దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. అప్లోడ్ చేసేటప్పుడు తలెత్తే సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఒక హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!