Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: “వందేమాతరం” 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్సభ అజెండాలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండవ వక్తగా తన ప్రసంగాన్ని వినిపిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.
READ MORE: Drunken Drive : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. 474 మంది దొరికారు..!
Also Read
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
లోక్సభ చర్చ తర్వాత.. రాజ్యసభలో సైతం మంగళవారం “వందేమాతరం” గురించి చర్చిస్తుంది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. ఆరోగ్య మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా రెండవ స్పీకర్గా ప్రసంగిస్తారు. ఉభయ సభలలో జరిగే చర్చ భారత జాతీయవాదానికి చిహ్నమైన “వందేమాతరం” చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.. అయితే, డిసెంబర్ 2న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పాలక, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఈ అంశంపై చర్చించడానికి అంగీకరించింది. కాగా.. 1875లో గొప్ప సాహిత్యవేత్త బంకిం చంద్ర ఛటర్జీ బెంగాలీలో వందేమాతరం రాశారు. ఈ పాట 1882లో మొదట ప్రచురించిన ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో భాగం. ఈ పాటను జదునాథ్ భట్టాచార్య స్వరపరిచారు. లక్షలాది మంది విప్లవకారులను ఏకం చేస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం ఒక ప్రధాన ప్రేరణగా మారింది. 1950లో భారత గణతంత్రం ఏర్పడటంతో దీనిని జాతీయ గీతంగా స్వీకరించారు.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!