Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: “వందేమాతరం” 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్సభ అజెండాలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండవ వక్తగా తన ప్రసంగాన్ని వినిపిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.
READ MORE: Drunken Drive : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. 474 మంది దొరికారు..!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
లోక్సభ చర్చ తర్వాత.. రాజ్యసభలో సైతం మంగళవారం “వందేమాతరం” గురించి చర్చిస్తుంది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. ఆరోగ్య మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా రెండవ స్పీకర్గా ప్రసంగిస్తారు. ఉభయ సభలలో జరిగే చర్చ భారత జాతీయవాదానికి చిహ్నమైన “వందేమాతరం” చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.. అయితే, డిసెంబర్ 2న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పాలక, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఈ అంశంపై చర్చించడానికి అంగీకరించింది. కాగా.. 1875లో గొప్ప సాహిత్యవేత్త బంకిం చంద్ర ఛటర్జీ బెంగాలీలో వందేమాతరం రాశారు. ఈ పాట 1882లో మొదట ప్రచురించిన ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో భాగం. ఈ పాటను జదునాథ్ భట్టాచార్య స్వరపరిచారు. లక్షలాది మంది విప్లవకారులను ఏకం చేస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం ఒక ప్రధాన ప్రేరణగా మారింది. 1950లో భారత గణతంత్రం ఏర్పడటంతో దీనిని జాతీయ గీతంగా స్వీకరించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!