Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: “వందేమాతరం” 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్సభ అజెండాలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండవ వక్తగా తన ప్రసంగాన్ని వినిపిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.
READ MORE: Drunken Drive : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. 474 మంది దొరికారు..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
లోక్సభ చర్చ తర్వాత.. రాజ్యసభలో సైతం మంగళవారం “వందేమాతరం” గురించి చర్చిస్తుంది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. ఆరోగ్య మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా రెండవ స్పీకర్గా ప్రసంగిస్తారు. ఉభయ సభలలో జరిగే చర్చ భారత జాతీయవాదానికి చిహ్నమైన “వందేమాతరం” చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.. అయితే, డిసెంబర్ 2న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పాలక, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఈ అంశంపై చర్చించడానికి అంగీకరించింది. కాగా.. 1875లో గొప్ప సాహిత్యవేత్త బంకిం చంద్ర ఛటర్జీ బెంగాలీలో వందేమాతరం రాశారు. ఈ పాట 1882లో మొదట ప్రచురించిన ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో భాగం. ఈ పాటను జదునాథ్ భట్టాచార్య స్వరపరిచారు. లక్షలాది మంది విప్లవకారులను ఏకం చేస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం ఒక ప్రధాన ప్రేరణగా మారింది. 1950లో భారత గణతంత్రం ఏర్పడటంతో దీనిని జాతీయ గీతంగా స్వీకరించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!