Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: “వందేమాతరం” 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్సభ అజెండాలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండవ వక్తగా తన ప్రసంగాన్ని వినిపిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.
READ MORE: Drunken Drive : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. 474 మంది దొరికారు..!
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
లోక్సభ చర్చ తర్వాత.. రాజ్యసభలో సైతం మంగళవారం “వందేమాతరం” గురించి చర్చిస్తుంది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. ఆరోగ్య మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా రెండవ స్పీకర్గా ప్రసంగిస్తారు. ఉభయ సభలలో జరిగే చర్చ భారత జాతీయవాదానికి చిహ్నమైన “వందేమాతరం” చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.. అయితే, డిసెంబర్ 2న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పాలక, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఈ అంశంపై చర్చించడానికి అంగీకరించింది. కాగా.. 1875లో గొప్ప సాహిత్యవేత్త బంకిం చంద్ర ఛటర్జీ బెంగాలీలో వందేమాతరం రాశారు. ఈ పాట 1882లో మొదట ప్రచురించిన ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో భాగం. ఈ పాటను జదునాథ్ భట్టాచార్య స్వరపరిచారు. లక్షలాది మంది విప్లవకారులను ఏకం చేస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం ఒక ప్రధాన ప్రేరణగా మారింది. 1950లో భారత గణతంత్రం ఏర్పడటంతో దీనిని జాతీయ గీతంగా స్వీకరించారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!