No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Confidence Motion: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మణిపూర్ అంశంపై లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ నోటీసు సమర్పించారు. ఈ అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నోటీసు ఇచ్చారు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అవిశ్వాసం పెట్టడం ద్వారా ప్రధాని స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇతర అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) భావిస్తోంది.
Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్మెంట్ లెటర్.. జీతం ఎంతో తెలుసా?
Also Read
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం మెజారిటీని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదం పొందినట్లయితే, ప్రభుత్వం రాజీనామా చేయాలి. తీర్మానం జాబితా చేయబడిన తర్వాత, లోక్సభ స్పీకర్ దానిని సభ లోపల ప్రకటిస్తారు. అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. సభలో తీర్మానం ఆమోదం పొందితే, అవిశ్వాస తీర్మానంపై చర్చతోపాటు ఓటింగ్ తేదీని స్పీకర్ ప్రకటిస్తారు. లోక్సభలోని 543 స్థానాలకు గాను ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభలో ఎన్డీయేకు 330 మందికి పైగా సభ్యులు ఉండగా, మెజారిటీ మార్క్ 272. కాగా ‘ఇండియా’లో చేరి ఉన్న పార్టీలకు దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలకు 60 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. వారు ఈ రెండు శిబిరాల వెలుపల ఉన్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..