RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ
- ఆర్బీఐ అధికారిక గణాంకాలు విడుదల
- తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో గడ్డు పరిస్థితులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం దేశంపై స్పష్టంగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి దేశంలో ద్రవ్యోల్బణం వేగవంతం అయింది. దీనికి తాజాగా వెలువడిన ఆర్బీఐ గణాంకాలే ఉదాహరణ.
సోమవారం విడుదలైన ఆర్బీఐ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, రవాణా ఖర్చులు, బంగారం-వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ ఊపందుకుంది. ఇదే సమయంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగానికి పైగా ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని మించిపోయింది.
Also Read
తెలంగాణలోనే అత్యధిక ద్రవ్యోల్బణం
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తెలంగాణలో అత్యధికంగా 6.36 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చెరో 5.39 శాతం నమోదైంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. తెలంగాణ – 6.36 శాతం, ఆంధ్రప్రదేశ్ – 5.39 శాతం, పుదుచ్చేరి – 5.39 శాతం, తమిళనాడు – 5.24 శాతం, ఒడిశా – 5.15 శాతం, మధ్యప్రదేశ్ – 5.09 శాతం, అండమాన్ నికోబార్ – 5.08 శాతం నమోదైంది. అలాగే కర్ణాటక (4.8 శాతం), రాజస్థాన్ (4.7 శాతం), ఉత్తరప్రదేశ్ (4.56 శాతం), కేరళ (4.34 శాతం), జార్ఖండ్ (4.29 శాతం), ఉత్తరాఖండ్ (4.13 శాతం), గుజరాత్ (4.01 శాతం) రాష్ట్రాల్లో ఆర్బీఐ లక్ష్యాన్ని మించి ద్రవ్యోల్బణం నమోదైంది.
అత్యల్ప ద్రవ్యోల్బణం ఎక్కడ?
దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం మిజోరంలో నమోదైంది. అక్కడ 1.63 శాతం మాత్రమే నమోదైంది. తర్వాతి స్థానాల్లో త్రిపుర – 1.65 శాతం, అరుణాచల్ ప్రదేశ్ – 2.47 శాతం, మేఘాలయ – 2.64 శాతం, నాగాలాండ్ – 2.83 శాతం, మణిపూర్ – 2.94 శాతం, ఢిల్లీ – 2.96 శాతం ఉన్నాయి. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 3.93 శాతం ఉండగా.. జూన్లో 4.38 శాతానికి పెరిగింది. ఇది గత ఆరు నెలల్లో నమోదైన అత్యధిక స్థాయిగా నమోదైంది. నెలవారీగా చూస్తే వినియోగదారుల ధరలు 1.03 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యధిక నెలవారీ పెరుగుదలగా నమోదైంది. జూన్లో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతానికి చేరుకుంది. మేలో ఇది 4.78 శాతంగా ఉంది.
అత్యధికంగా పెరిగిన ధరలు
ప్రధాన వినియోగ విభాగాల్లో నగల ధరలు – 50.2 శాతం, సరుకు రవాణా సేవలు – 7.7 శాతం,
వ్యక్తిగత వాహనాల నిర్వహణ ఖర్చు – 7.4 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార సేవలు – 6.9 శాతం,
పాన్, పొగాకు – 6.9 శాతం, ఆహార పదార్థాలు – 5.3 శాతం, గాజు పాత్రలు, గృహోపకరణాలు – 4.7 శాతం పెరిగాయి.
కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి
అయితే కొన్ని విభాగాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. వాహనాల కొనుగోలు – -4.6 శాతం, ఇల్లు, తోట పరికరాలు – -0.9 శాతం, వినోద వస్తువులు – -0.7 శాతం, పానీయాలు – 0.2 శాతం, సమాచార, కమ్యూనికేషన్ సేవలు – 0.3 శాతం తగ్గాయి.
అత్యధికంగా పెరిగిన ఆహార పదార్థాలు
ఆహార పదార్థాల్లో అల్లం ధరలు – 50.41 శాతం, టమాటా – 31.92 శాతం, కిస్మిస్ (ఎండుద్రాక్ష) – 20.52 శాతం పెరిగాయి. ఇక బంగారం, వెండి ధరల దూకుడు కొనసాగుతోంది. విలువైన లోహాల్లో ధరల పెరుగుదల కొనసాగుతోంది. వెండి నగలు – 133.21 శాతం, బంగారం, వజ్రాలు, ప్లాటినం నగలు – 36.82 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.




తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!