CCTV Video: ”పంది మాంసం” తెచ్చిన తంటా.. కత్తితో దాడి.. సీసీటీవీ వీడియో వైరల్
CCTV Video: ముంబై సమీపంలోని వసాయ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక నివాసితుల ప్రకారం.. ఈ దాడి పంది మాంసం వ్యాపారం నేపథ్యం రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదమని తెలిస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ పరిసరాల్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియోలో ఓ పికప్ వ్యాన్ మరో వ్యాన్ను ఢీకొట్టడం, దానిని ఆపడం కనిపిస్తుంది. అనంతరం ఓ వ్యక్తిని వాహనంలో నుంచి బయటకు లాగి కత్తితో బాగా కొట్టారు. దాడి చేసిన వ్యక్తులు కత్తిని ఊపుతూ, తుపాకీ చేతబట్టి చుట్టుపక్కల వారిని భయపెట్టడం కనిపిస్తుంది. ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దాడికి గురైన వ్యక్తిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాడి తర్వాత దాడి చేసిన వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హర్జీత్ సింగ్, నిందితుల కోసం అనేక బృందాలను ఏర్పాటు చేశారు. హర్జీత్ సింగ్తో ప్రయాణించిన మరో ఇద్దరిపై నిందితులు దాడి చేయలేదు. ఇదంతా విజువల్స్లో కనిపించింది. ఘటనా స్థలి నుంచి హర్జీత్ సింగ్ వాహనం, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి వచ్చిన దృశ్యాలు, క్లూస్ కోసం పోలీసు అధికారులు స్పాట్ను పరిశీలించారు.
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
Rohingya Stranded: నడి సముద్రంలో చిక్కుకున్న 100 మందికి పైగా రోహింగ్యాలు..
హర్జీత్ సింగ్ను రక్షించడానికి ప్రయత్నించిన వారిని తుపాకీతో హెచ్చరించారని స్థానిక నివాసి జయేంద్ర పాటిల్ తెలిపారు. కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవడానికి సాహసించలేదన్నారు.ఈ వివాదం పంది మాంసం వ్యాపారంతో ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. ‘వారు పంది మాంసం వ్యాపారులు. ఈ దాడి దానితో ముడిపడి ఉండవచ్చు.’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చేసిన వారు హర్జీత్ సింగ్ను తమ పికప్ వ్యాన్లోకి ఎక్కించుకుని వెళ్లిపోయారని జయేంద్ర పాటిల్ చెప్పారు.
#WATCH | Maharashtra: Case registered against 3 unidentified persons after a scuffle broke out b/w 2 groups in Palghar's Naik Pada y'day. A person, HS Dadu, got injured after being attacked with a sword. A sword & car recovered from the spot.Probe on: Waliv Police
(CCTV Visuals) pic.twitter.com/Jt6TRiCPtG
— ANI (@ANI) December 21, 2022
తాజావార్తలు
-
Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్
-
Sanju Samson: ‘చెట్టా’ కాదు.. ‘సంజూ’ అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Ruturaj Gaikwad: అతడు సీఎస్కే ‘బ్యాక్ బోన్’.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!