OLX Layoff : OLXలో ఉద్యోగుల తొలగింపు..1500మందిపై వేటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆర్ధిక మాన్యం వెంటాడుతున్న వేలా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. దీంతో.. ఉద్యోగులను యదేచ్ఛగా తొలగిస్తున్నారు. ఒకదాని తర్వాత మరో కంపెనీ భారీగా ఉద్యోగులకు ఇంటికి సాగనంపుతున్నాయి. ఇక తాజాగా ఆన్లైన్లో సెకండ్ హ్యండ్ వస్తువులను విక్రయించే ఓఎల్ఎక్స్ గ్రూప్ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో పది వేల మంది పనిచేస్తుండగా పదిహేను వందల మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఓఎల్ఎక్స్ గ్రూప్ తొలగింపు నిర్ణయంతో కంపెనీ ఆటో బిజినెస్పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ ఆపరేషన్ టీంలో పని చేసే ఉద్యోగుల పైన తొలగింపుల ప్రభావం ఉండనుంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తు ఆశయాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటునట్లు స్పష్టం చేసింది ఓఎల్ఎక్స్.
Also Read : Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య
Also Read
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ఇదిలా ఉంటే.. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం, డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందిని పీకేసిన సంస్థ.. మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. గతేడాది రెస్పిరేటరీ డివైజ్లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి. ఫిలిప్స్ సంస్థ గత ఏడాది 2022, అక్టోబర్లో 4,000 మందిని తొలగించింది. గతంలో మాదిరి సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డచ్ సంస్థ ఫిలిప్స్ తెలిపింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.
Also Read : Union Budget 2023: సామాన్యులకు శుభవార్త.. పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్.. వాటి మీదే సీతమ్మ ఫోకస్?
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!