Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Off The Record About Minister Kolusu Parthasarathy

Off The Record: జోగి రమేష్‌ ఘటనలో మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

Published Date :December 17, 2024 , 10:00 pm
By Sudhakar Ravula
  • నూజివీడులో సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ..
  • కలిసి పాల్గొన్న మంత్రి సారధి, మాజీ మంత్రి జోగి రమేష్‌..
  • ఒకే వాహనంపై వీధుల్లో భారీ ర్యాలీ..
  • మంత్రి మీద ఫైరైపోతున్న టీడీపీ కేడర్‌..
  • అప్పట్లో చంద్రబాబు ఇంటి మీద దాడికి జోగి యత్నం..
  • బాబు, పవన్‌, లోకేష్‌ మీద తిట్ల దండకాలు..
  • టీడీపీ అధిష్టానం ఆగ్రహం, వివరణకు లోకేష్‌ ఆదేశం..
  • సోషల్‌ మీడియాలో మంత్రిని ఉతికారేస్తున్న తమ్ముళ్ళు..
  • పదే పదే వివరణ ఇచ్చుకుంటున్న మంత్రి సారధి..
Off The Record: జోగి రమేష్‌ ఘటనలో మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారా? అంటే… అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్‌ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రామ్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్‌ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్ళే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఒకే వాహనంపై మంత్రి పార్ధసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి వెళ్ళారు. హాయిగా నవ్వుతూ… కలిసే అందరికీ అభివాదాలు చేస్తూ… ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒకే వేదికపై కూర్చుని ఆసాంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే… ఈ సీన్లే… వైరల్‌ అయి రచ్చ జరుగుతోంది.

Read Also: Rajagopal Reddy: ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే బాగుంటుంది.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

టీడీపీ కేడర్‌ అయితే మంత్రి మీద ఓ రేంజ్‌లో ఫైరైపోతోంది. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన, చంద్రబాబు, పవన్, లోకేష్‌లను ఇష్టారీతిన తిట్టిన జోగి రమేష్‌తో కలిసి మంత్రి పార్థసారధి ఎలా ఊరేగుతారంటూ నిలదీస్తున్నారు టీడీపీ లీడర్స్‌, కార్యకర్తలు. మేటర్‌ సీరియస్‌ అవడంతో… మొత్తం వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధిష్టానం… సారధి, గౌతు శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దర్నీ లోకేష్‌ ఆదేశించడంతో వ్యవహారం వేడెక్కింది. దీంతో పార్ధసారధి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు సారీ చెప్పారు. అయినప్పటికీ తమ్ముళ్ళు చల్లబడలేదు. సారధి తీరును తప్పు పడుతూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ఉతికారేస్తున్నారు. పోస్టులు, వీడియోలు వైరల్ అవడంతో… రెండోసారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సారధి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంచేశారు. టీడీపీ క్యాడర్‌ను నొప్పించినందుకు సారీ.. సో.. సారీ.. అంటూ పదే పదే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు మంత్రి. కార్యక్రమం ప్రభుత్వం లేదా పార్టీ ఆధ్వర్యంలో జరగలేదని, స్థానికంగా ఉన్న గౌడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిందని, తనను పిలిస్తే వెళ్ళాను తప్ప.. ఎవరెవరు అందులో పాల్గొంటున్నారన్నది తెలియదని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సారధి. జోగి రమేష్‌ను కార్యక్రమంలో చూసి తాను కూడా షాకయ్యానని, అయినప్పటికీ టీడీపీ శ్రేణులకు సారీ చెబుతున్నానని అన్నారాయన. అయినా తెలుగుదేశం కేడర్‌ మాత్రం తగ్గడం లేదట. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఏమీ తెలుసుకోకుండానే మంత్రి గుడ్డిగా ఓ కార్యక్రమంలో పాల్గొంటారా అంటూ సోషల్‌ మీడియా వేదికగానే నిలదీస్తోంది కేడర్‌.

Read Also: Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు

వైసీపీ హయాంలో ఐదేళ్ళపాటు పార్ధసారధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి నూజివీడుకు మారి పోటీ చేసి గెలిచి మంత్రయ్యారు. కొత్తగా నెలల ముందు మాత్రమే పార్టీలో చేరినా… సారధికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో… గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్టు తిట్టడమే కాకుండా, ఏకంగా ఆయన ఇంటిపై దాడికి వెళ్ళిన జోగి రమేష్‌తో కలిసి సారధి ఎలా ర్యాలీలో పాల్గొంటారు? ఒకే వేదికను ఎలా పంచుకుంటారన్నది టీడీపీ శ్రేణుల క్వశ్చన్‌ అట. అందుకే సారధిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ జోగి రమేష్, సారధి ఒకే తాను ముక్కలంటూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇక పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి తీరుపై మండిపడ్డారు. మంత్రి ఆలోచనల్లో నిజాయితీ ఉంటే… జోగి రమేష్‌ను చూసిన వెంటనే వాహనం నుంచి దిగి వెళ్లిపోవాలి కదా? అలా కాకుండా ఆయనతో ఎందుకు అంటకాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా. ఈ పరిస్థితుల్లో మంత్రి సారధి ఎంతలా వివరణ ఇచ్చుకున్నా… పూర్తి స్థాయిలో జోగి రచ్చ నుంచి బయటపడలేక పోతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక గౌడ సామాజికవర్గంలోని వైసీపీనేత ఆహ్వానంతోనే జోగి రమేష్‌ ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటారని సారధి చెబుతున్నా… ఒకే వాహనంపై ఎలా ర్యాలీగా వెళ్తారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారట మంత్రివర్యులు. అందుకే టీడీపీ శ్రేణులకు పదే పదే సారీ చెబుతూ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్నవారు మాత్రం జోగి ఎపిసోడ్‌లో పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారు. ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • Jogi Ramesh
  • Minister Kolusu Parthasarathy
  • off the record
  • tdp

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions