Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు
- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు కొత్త చిక్కులు
- ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య పరువు నష్టం కేసు
- రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది. ఈ నోటీసుకు 2025 జనవరి 10లోగా సమాధానం ఇవ్వాలని సంజయ్ సింగ్ను కోర్టు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు. దీంతో.. సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్లో ఉన్న సివిల్ కోర్టులో పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేసింది.
Read Also: New Registration Charges: జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
బిచోలిమ్ సివిల్ కోర్టు మంగళవారం ఈ కేసును విచారించి సంజయ్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించే ప్రకటనకు క్షమాపణలు చెప్పేలా సంజయ్ సింగ్ను ఆదేశించాలని సులక్షణ సావంత్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్షమాపణలో చెప్పిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు అవాస్తవమని, వాస్తవాల ఆధారంగా కాదని స్పష్టం చేయాలని తెలిపారు. సంజయ్ సింగ్ ప్రకటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తన పరువు తీసేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా సంజయ్ సింగ్ను నిరోధించాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన కొంతమందికి లక్షల రూపాయలు బలవంతంగా చెల్లించాలని గోవాలో చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఉద్యోగానికి సంబంధించిన నగదు కుంభకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!