Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు
- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు కొత్త చిక్కులు
- ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య పరువు నష్టం కేసు
- రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది. ఈ నోటీసుకు 2025 జనవరి 10లోగా సమాధానం ఇవ్వాలని సంజయ్ సింగ్ను కోర్టు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు. దీంతో.. సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్లో ఉన్న సివిల్ కోర్టులో పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేసింది.
Read Also: New Registration Charges: జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
బిచోలిమ్ సివిల్ కోర్టు మంగళవారం ఈ కేసును విచారించి సంజయ్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించే ప్రకటనకు క్షమాపణలు చెప్పేలా సంజయ్ సింగ్ను ఆదేశించాలని సులక్షణ సావంత్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్షమాపణలో చెప్పిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు అవాస్తవమని, వాస్తవాల ఆధారంగా కాదని స్పష్టం చేయాలని తెలిపారు. సంజయ్ సింగ్ ప్రకటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తన పరువు తీసేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా సంజయ్ సింగ్ను నిరోధించాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన కొంతమందికి లక్షల రూపాయలు బలవంతంగా చెల్లించాలని గోవాలో చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఉద్యోగానికి సంబంధించిన నగదు కుంభకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!