Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Minister Jogi Ramesh Vs Mla Vasantha Krishna Prasad In Mylavaram

Off The Record: మైలవరం వైసీపీలో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చేసిందా..?

NTV Telugu Twitter
Published Date :August 22, 2023 , 9:15 pm
By Sudhakar Ravula
Off The Record: మైలవరం వైసీపీలో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చేసిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: 45 రోజుల అమెరికా టూర్‌ తర్వాత తిరిగొచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టీ పెట్టగానే.. లోకల్‌గా తనను ఇబ్బందిపెట్టే వారికి వార్నింగ్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్‌ మంత్రి జోగి రమేష్‌గా వ్యవహారం నడుస్తున్నందున ఆ వార్నింగ్స్‌ అన్నీ.. మంత్రిని ఉద్దేశించేనన్నది లోకల్‌ టాక్‌. ఇద్దరి మధ్య సోషల్‌ మీడియాలో సైతం వార్‌ ఓ రేంజ్‌లో జరుగుతోంది. మంత్రి జోగి తీరుతో విసిగిపోయిన వసంత గతంలో గడప గడపకు కార్యక్రమాన్ని వదిలేసి హైదరబాద్ వెళ్ళిపోయారట. సీఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకుని పంచాయితీ చేసినా.. మేటర్‌ మళ్ళీ మొదటికే వచ్చిందంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో ఒకసారి అమెరికా వెళ్తే.. ఎన్నికలలో ఓడిపోయి వెళ్లినట్టు దుష్ప్రచారం చేశారని, మళ్ళీ ఇప్పుడు వెళ్తే.. ఈసారి సీటు ఇవ్వరని చెప్పడంతో అలిగి వెళ్ళినట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతోందట వసంత వర్గం. అందుకే.. ఈసారి వచ్చీ రాగానే.. జోగి వర్గానికి వార్నింగ్ ఇచ్చారంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. పార్టీలో కొందరు వర్గాలను పెంచి పోషిస్తున్నారని, పదవులు వచ్చే వరకు నక్కవినయాలు ప్రదర్శించి.. ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని కామెంట్ చేశారు వసంత. పార్టీ తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే వ్యాపారాలు చేసుకుంటానని ఆయన చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌ అయ్యాయి. ఇక్కడేం జరుగుతోందో అధిష్టానానికి తెలుసని, ఇకపై ఇక్కడి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే ఉద్దేశ్యం కూడా తనకు లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు ఎమ్మెల్యే. కావాలని వర్గాలను కొందరు పెంచి పోషిస్తున్నారని, ఎప్పుడు కుదురుతుందా సీటు లాగేద్దామా అన్న ధ్యాస తప్ప వేరే పనే లేనట్టుగా ప్రవర్తించేవారి గురించి ఆలోచించడం కూడా అనవసరమని అన్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఇవన్నీ మంత్రి జోగి రమేష్‌ను ఉద్దేశించి చేసినవేనన్నది నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం.

ఎమ్మెల్యే వసంత అమెరికా టూర్ లో ఉన్న సమయంలోనే మైలవరం టికెట్ జోగి రమేష్‌కు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు పోస్టింగ్స్‌ సోషల్ మీడియాలో తెగ తిరిగేశాయి. అదంతా జోగి వర్గం పనే అన్నది వసంత మనుషుల ఆరోపణ. దీంతో అమెరికా టూర్ నుంచి వచ్చీరాగానే జోగి వర్గం టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఇకపై అధిష్టానం దగ్గర ఈ విషయంపై పంచాయితీ పెట్టే ఉద్దేశ్యం లేదంటూ ఖరాకండీగా చెప్పటం ద్వారా.. తాను ఈ విషయంలో విసిగిపోయాననే సంకేతాలను ఇచ్చారంటున్నారు. సహజంగా తాను సౌమ్యుడిని అని, అయితే ఇది ఒకవైపే నని, ఎవరి బెదిరింపులకు లొంగే రకాన్ని కాదని.. ఇది తన రెండో వైపంటూ వార్నింగ్ లు ఇచ్చారు వసంత. దీంతో ఎమ్మెల్యే తదుపరి ఏం చేయబోతున్నారోనన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కొన్నాళ్ళుగా గన్నవరంలో వర్గపోరుతో ఇబ్బందిపడిన వైసీపీ అధిష్టానం తాజాగా మైలవరం రచ్చతో మరింత ఇరకకాటంలో పడుతోందట. వసంత తాజా వ్యాఖ్యలతో అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Minister Jogi Ramesh
  • MLA Vasantha Krishna Prasad
  • Mylavaram
  • off the record

తాజావార్తలు

  • Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

  • Shubman Gill: టీమిండియా కెప్టెన్ అద్భుతమైన సెంచరీ..

  • Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..

  • Vishnupriya : వామ్మో.. రెచ్చిపోయి అందాలన్నీ చూపించిన విష్ణుప్రియ..

  • Off the Record: ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అంతా దోచేస్తున్నారా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions