Muddaraboina Venkateswararao: వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muddaraboina Venkateswararao: ఎన్నికల సమయంలో ఏపీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు.. సీట్లు దక్కకపోవడంతో విపక్షాల వైపు చూస్తుంటే.. ఇక, సుదీర్ఘంగా విపక్షంలో పనిచేసే.. ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని తేలడంతో.. మరికొందరు నేతలు అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. వైసీపీకి గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వచ్చారు ముద్రోయిన.. దీంతో.. ఆయన టీడీపీకి గుడ్బై చెప్పేసి.. వైసీపీలో చేరుతారని.. ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఆయన క్యాంప్ ఆఫీస్కు వచ్చారనే చర్చ నడుస్తోంది. అయితే, తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్న విషయం విదితమే.
Read Also: Pakistan: పెళ్లి వేడుకలో గ్యాంగ్స్టర్ హత్య
Also Read
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
కాగా, నూజివీడు టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.. ఇక్కడ ఇంఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనధికారిక ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారధి మధ్య కోల్డ్ వార్ ముదిరిపోయింది.. పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి.. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట. దీంతో, నూజివీడులో తన వర్గాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన సారథి.. పార్టీలోకి అధికారికంగా చేరకపోయినా ఇంఛార్జ్గా తాను చేయాల్సిన పనులను పెనమలూరు నుంచే చక్కబెట్టేస్తున్నారట. అయితే, ఈ పరిణామాలన్నీ కూడా నూజివీడు టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నచ్చడం లేదు.. ఇక, తాజాగా నిర్వహించిన సమావేశంలో.. కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం అంటూ తేల్చి చెప్పారుముద్దరబోయిన.. ఈ సందర్భంగా ముద్దరబోయిన మాట్లాడుతూ… గత రెండు సందర్భాలలో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం కుటుంబంలోనే కలిసి ఉన్నాం ఫలితం పొందే సమయానికి అభ్యర్థి మార్పు అంటూ ప్రచారం సాగుతుంది. 10 సంవత్సరాలలో ఇంటింటికి వెళ్లా, ప్రతి వ్యక్తిని కలిసా ప్రజా సమస్యలు తెలుసుకున్నా.. గెలుపు టీడీపీ దేనని ప్రజల మాట, అధిష్టానం నిర్ణయంపై కార్యకర్తలు మీరు చెప్పే మాట నేను ఆచరిస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ముద్దరబోయిన.. దీంతో.. ఆయన సైకిల్ దిగి.. ఫ్యాన్ కిందకు చేరతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!