Noro Virus : ఎర్నాకులంలో నోరో వైరస్ నిర్ధారణ.. 19 మంది విద్యార్థులకు అనారోగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు. డయేరియా-ప్రేరేపిత రోటా వైరస్ మాదిరిగానే ఉన్న ఈ వైరస్ సోకిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నోరా వైరస్ ప్రభలకుండా పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు సెలవు ప్రకటించారు. నోరా వైరస్ సోకిన వ్యక్తి నుండి ఇతరులకు వ్యాపిస్తుంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది.
Read Also: Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
నోరోవైరస్ అంటే ఏమిటి?
నోరో అనేది కడుపు ఫ్లూకి కారణమయ్యే వైరస్ల సమూహం. వైరస్ కడుపు, ప్రేగులపై దాడి చేస్తోంది. తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. నోరోవైరస్ సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో స్వల్పంగా ఉన్నప్పటికీ, ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సోకినట్లయితే అది తీవ్రంగా ఉంటుంది. మూసివేసిన ప్రదేశాలలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రెండు రోజుల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు మొదలవుతాయి. మైకము, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కూడా నోరోవైరస్ సంక్రమణతో పాటుగా ఉంటాయి.
Read Also: Honda Activa H-Smart: మార్కెట్లోకి హోండా యాక్టివా హెచ్-స్మార్ట్..ఫీచర్స్ అదుర్స్
ఈ అంటువ్యాధి వైరస్ కలుషితమైన నీరు, ఆహారం, ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తికి అనేకసార్లు ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అనారోగ్యం సాధారణంగా రెండు లేదా మూడు రోజులు ఉంటుంది. తగినంత నీరు త్రాగటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రెస్ట్రూమ్ని ఉపయోగించిన తర్వాత.. మీ పిల్లల డైపర్ని మార్చిన తర్వాత సబ్బు, నీటితో మీ చేతులను బాగా కడగాలి. తినే ముందు చేతులు కడుక్కోవాలి. వ్యాప్తి సమయంలో ఉపరితలాలను హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమిసంహారక చేయాలి. RT PCR పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్లు కనుగొనబడలేదు. వైరస్తో పోరాడడంలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం కీలకం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!